ఈ స్టార్ హీరోయిన్ కు మూడు బ్రేక్ అప్ లు.. ఎందుకు ఎలా అయ్యాయి..!!

Mamatha Reddy
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న రేఖ జీవితం తెరచిన పుస్తకం.. సావిత్రి భర్త, జెమినీ గణేశన్ కూతురు గా ఆమె ఇండస్ట్రీకి పరిచమై స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. సౌత్ నుంచి ఉత్తరాదికి వెళ్లి ఆ రేంజ్ లో ఫేమస్ అయిన హీరోయిన్ బహుశా ఈమె ఒక్కరే కావచ్చు. అందం అభినయం తో పాటు చక్కని రూపం, పద్ధతి ఆమె సొంతం. అయితే అన్ని అనుకున్నట్లు అయితే అది జీవితం ఎలా అవుతుంది. ఆమె సినీ జీవితం సూపర్ హిట్ అయినప్పటికీ అయన వైవాహిక జీవితం మాత్రం గందరగోళంగా అయిపొయింది..
అప్పట్లో ఆమె ఇమ్రాన్ తో నడిపిన ప్రేమ వ్యవహారం పెద్ద విషయం అయిన విషయం తెలిసిందే.. జాతీయ అంతర్జాతీయ మీడియా లో సైతం వీటిగురించి కథనాలు రాశేవారు.. అయితే ప్రేమలో ఉన్నప్పుడు బాగానే ఉన్నప్పటికీ పెళ్లి అనేసరికి ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరలేదు.. దాంతో ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఇమ్రాన్ తో బ్రేక్ అప్ తర్వాత ఆమె కొంతకాలం సింగిల్ గా ఉంది. అయితే కొంతకాలం తర్వాత ఆమె పారిశ్రామిక వేత్త అయిన ముఖేష్ అగర్వాల్ ను 1990 లో విహహం చేసుకుంది.. అయితే కొన్ని సంవత్సరాలకే అయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
అసలు అంత అందమైన భార్య ను పెట్టుకుని ముఖేష్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు.  రేఖ కు మూడు ప్రేమలు కూడా బ్రేకప్ అవ్వడంతో ఆమె సోలో జీవితానికి అలవాటు పడ్డారు. ఇప్పటికీ ఆమె ఎదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న రేఖ ఎంతో మందికి ఆల్ టైమ్ ఫేవరేట్ హీరోయిన్ గా నిలిచారు. అలాంటి రేఖ జీవితంలో ఈ బ్రేకప్ లు ఎప్పటికి రహస్యాలుగానే మిగిలి పోతున్నాయి. ఏదేమైనా హీరోయిన్ జీవితాలు బయటకి కనిపించే అంత అందంగామాత్రం ఉండవు అనిచెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: