అపరిచితుడు ఇప్పుడు రీమేక్ చేయడానికి కారణం అదేనట .....??

GVK Writings
కోలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత విక్రమ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్బస్టర్ సక్సెస్ ఫుల్ మూవీ అపరిచితుడు. 2005 లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా అతిపెద్ద విజయాన్ని అందుకుంది. సదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మూడు విభిన్న రకాల షేడ్స్ కలిగిన పాత్రలో విక్రమ్ కనపరిచిన అత్యద్భుత నటనకి ప్రేక్షకాభిమానులతో పాటు విమర్శకుల నుండి సైతం ఎంతో గొప్ప ప్రశంసలు దక్కాయి. హారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకి శంకర్ రాసుకున్న స్క్రిప్ట్ మరింత అద్భుతమనే చెప్పాలి.
అయితే ఎన్నో ఏళ్ల తర్వాత అతి త్వరలో ఈ సినిమా యొక్క బాలీవుడ్ రీమేక్ ని యువ నటుడు రణ్ వీర్ సింగ్ తో పెన్ మూవీస్ బ్యానర్ పై మరింత అత్యద్భుతంగా తెరకెక్కించనున్నారు శంకర్. రెండు రోజుల క్రితం ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు శంకర్ అపరిచితుడు సినిమాను హిందీలో రీమేక్ చేయడం ఏమిటి అనే ఆలోచన అందరిలోనూ మెదులుతోంది. కాగా దానికి ప్రధానమైన కారణం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.
అపరిచితుడు సినిమా యొక్క స్టోరీ, స్క్రిప్ట్ యూనివర్సల్ అపీల్ కలిగినవని అలానే ఆ స్టొరీని ఎన్నిసార్లు తీసినప్పటికీ కూడా అది ఎప్పటికీ కూడా ఫ్రెష్ గానే ఉంటుందని, ఇక ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ మరింతగా పెరగటంతో అపరిచితుడు మూవీని మరింత అత్యద్భుతంగా తెరకెక్కించే అవకాశం ఉంటుందనేది ఆయన ఆలోచనట. అది మాత్రమే కాదని, ఒక సరికొత్త స్టోరీ తో సినిమా తీయడంకంటే సౌత్ లో ఆల్రెడీ సక్సెస్ సాధించిన కథ అయితే, బాలీవుడ్ లో తనకు మంచి బూస్ట్ వస్తుందనేది కూడా శంకర్ ఆలోచనట. కాగా త్వరలో తెరకెక్కనున్న ఈ సినిమా పై అటు రణ్ వీర్ సింగ్ తో పాటు ఇటు శంకర్ పై కూడా నమ్మకం ఉందని అలానే యూనిట్ కూడా తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్ సాధిస్తుందని ఆశాభావంతో ఉన్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనపడుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: