సత్యం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన భామ జనీలియా. ఈ సినిమాలో సుమంత్ పక్కన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. దాంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ లో బిజీ గా మారింది. ఇక సిద్ధార్థ్ హీరోగా నటించిన బొమ్మరిల్లు సినిమాలోనూ జనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో హాసిని పాత్రలో అల్లరి పిల్ల క్యారెక్టర్ లో అలరించింది. ఇక అప్పటి నుండి అల్లరి పిల్లగా నటించాలంటే దర్శకులు ముందుగా జనీలియా నే సంప్రదించేవారు. ఆ తరవాత హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే జనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుంది. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి మస్తీ, తెరె నాల్ లవ్ హోగయా సినిమాల్లో నటించారు. వీటిలో మస్తీ సినిమా మంచి విజయం సాధించింది. అయితే పెళ్లి తరవాత మాత్రం జనీలియా నటనకు దూరంగా ఉంది. ఇద్దరు పిల్లలు పుట్టడంతో వారి ఆలనా పాలనా చూసుకుంటూ గడిపేసింది.
ఇక ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవాళ్లు అవ్వడంతో జనీలియా మళ్లీ స్క్రీన్ పై మెరవానుకుంటుందట. అయితే ఇప్పటికే జనీలియాకు పలు సినిమాల్లో వదిన, అక్క క్యారెక్టర్లు వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించిందట. కానీ తాజా సమాచారం ప్రకారం జనీలియాకు హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. అది కూడా ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించే అవకాశం వచ్చిందని టాక్. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెడీ సినిమా మంచి విజయం సాధించింది. మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరు కలిసి నటించే అవకాశం వచ్చింది. ఇక ఇద్దరు పిల్లల తల్లైనప్పటికీ జనీలియా ఫిట్నెస్ గ్లామర్ విషయంలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హారోయిన్ లకు ఏమాత్రం తక్కువగా కనిపించడం లేదు. ఇక ఈ అమ్మడి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.