నాని కోసం గుడి కడితే అడివి శేష్ కోసం ఏకంగా తాజ్ మహల్ కట్టేసాడు

Mamatha Reddy
ఇండస్ట్రీ ఏదైనా ఒక సినిమా తెరకెక్కలంటే అన్ని విభాగాల నుంచి మంచి సహకారం అందడం ముఖ్యం.. డైరెక్టర్ చెప్పినట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు సరిగా పనిచేస్తేనే ఒక సినిమా రిలీజ్ అయ్యేది రిలీజ్ అయిన తర్వాత హిట్ అయ్యేది.. ఒక సినిమా తెరకెక్కుతున్న అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ , కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్ లాంటి విభాగాలు ఎంత ముఖ్యమో ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అంతకంటే ఎక్కువ గా ముఖ్యం.. ఒక చిత్రంలో సెట్స్ అందంగా ఎంత అందంగా తీర్చిదిద్దబడతా యో సినిమా అంత గ్రాండ్ లుక్ కనబడి హిట్ అవడానికి దోహదపడుతుంది.. అందుకే ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా సినీ నిర్మాతలు సెట్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ ఎవరు.
అలా మన టాలీవుడ్ లో చాలామంది ఆర్ట్ డైరెక్టర్లు తమ తమ పనితనం, ప్రతిభను చూపించి స్టార్ ఆర్ట్ డైరెక్టర్ గా మారారు.. వారి ప్రతి పనిని ఇచ్చి ప్రభుత్వం ఎన్నో సార్లు ప్రభుత్వం వన్ వారికి అవార్డులు అందజేసింది.. డైరెక్టర్లు కూడా ఆర్ట్ డైరెక్టర్లను మార్చడానికి ఎక్కువగా ఇష్టపడరు.. ఎందుకంటే తాము చెప్పిన దాన్ని ఇట్టే అర్థం చేసుకొని అద్భుతమైన సెట్ లను ఏర్పాటు చేసి వరుస సినిమాల అవకాశాలు కొట్టేస్తున్నారు కొంతమంది డైరెక్టర్లు.. అలాంటి వారిలో ఒకరు అవినాష్ కొల్ల..
పలు సినిమాలతో బిజీగా ఉన్న అవినాష్ కొల్ల ప్రస్తుతం నాని శ్యామ్ సింగ రాయ్, అడవి శేష్ మేజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.. శ్యామ్ సింఘ రాయ్ లో వందేళ్ల నాటి దేవాలయాన్ని అద్భుతమైన సెట్టు గా చిత్రీకరించిన అవినాష్, అడవి శేష్ మేజర్ లో తాజ్ మహల్ హోటల్ సెట్ ను ఆహా అనిపించేలా వేశాడట.. మహానటి సినిమాతో మంచి ఆర్ట్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఈయన ఈ సినిమాతో మరో రేంజ్ కి వెళ్లడం ఖాయం అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: