అల్లు అర్జున్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
సినిమా ఇండస్ట్రీలలో నిలదొక్కుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసినదే. ఒక హీరోయిన్ గా రాణించాలంటే మాత్రం శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుంది. కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే స్టార్ డం సంపాదించుకుంటారు. మరి కొంతమంది ఎంత కష్టపడినా కూడా గుర్తింపు తెచ్చుకోలేక పోతుంటారు. అంతే కాకుండా కాస్త లక్కు కూడా ఉండాలి. ఒకే చోట అదృష్టం కలిసి రాకపోతే దీంతో ఇతర ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నారు. తెలుగు సినిమాలలో నటించిన కొంతమంది హీరోయిన్లు, బాలీవుడ్ లోకి అడుగు పెడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది.
అలాంటి ఒక హీరోయిన్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం .. టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన వేదం సినిమా ద్వారా తెలుగు సిని ఇండస్ట్రీలో కి అడుగు పెట్టింది. ఇక దీక్షాసేత్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవితేజ నటించిన మిరపకాయ సినిమా లో నటించింది . అయితే ఈ రెండు సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా మాత్రమే నటించింది. దీంతో ఆమె నటనను మెచ్చిన దర్శకులు ఆ తర్వత ఆమెను వాంటెడ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ మెయిన్ హీరోయిన్ గా నటించినప్పటికీ , అందుకు తగిన ఫలితం రాలేదు. ఆ తర్వాత వచ్చిన రెబల్, ఉ కొడతారా.. ఉలిక్కిపడతారా సినిమాలలో రెండో హీరోయిన్ గా అవకాశం రావడంతో వద్దనకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ గా నిలిచాయి.
ఇక చేసేది లేక దీక్షాసేథ్ టాలీవుడ్ ను విడిచి పెట్టేసింది. బాలీవుడ్ కి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని అక్కడ కూడా అరంగేట్రం చేసింది.. అయితే అక్కడ కూడా దీక్షా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇటీవల దీక్ష తన లేటెస్ట్ ఫోటోలను రీసెంట్ గా షేర్ చేసింది. దీక్ష ఫోటోస్ చూసినవారందరూ షాక్ కు గురవుతున్నారు. ఆమె అప్పటికీ ఇప్పటికీ చాలా మారిందని కామెంట్ లు కూడా పెడుతున్నారు. అయితే గ్లామర్ డోస్ పెంచడంలో దీక్షకు సాటి ఎవరూ లేరు. ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాలను కుంటోదట . కాబట్టి దీక్ష ఏ సినిమాలో అవకాశం దక్కించుకుంటుందో చూడాలి మరి..