టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్న "బీనా" ఆంటీ...?

VAMSI
కరోనా పుణ్యమా అని థియేటర్లను మూసివేయడంతో ఎంటర్ టైన్మెంట్ రంగం సరికొత్త దారులను వెతుక్కుంది. ఇలా పుట్టినవే ఓ టి టి ప్రసార మాధ్యమాలు. ఇవి వచ్చిన తరువాత వెబ్ సిరీస్ లు ఎక్కువగా వస్తున్నాయి. కొత్త కాన్సెప్ట్ లను ఎంచుకుని సినిమాలకు మించి తెరకెక్కిస్తున్నారు. దీనితో ప్రస్తుతం భారతదేశంలో వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతోంది. ఈ వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతోమంది ప్రతిభ ఉన్న నటీనటులు వెలుగులోకి వస్తున్నారు. ఇలా బాలీవుడ్ లో తెరకెక్కినదే మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ను తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. దీనితో ఇది మంచి ఫాలోయింగ్ తో ముందుకు దూసుకుపోతోంది.

పేరుకు ఇది హిందీది అయినప్పటికీ... తెలుగులో కూడా డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకుంది. ఇందులో క్యారెక్టర్లకు అన్ని వర్గాల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా బీనా ఆంటీ అనే పాత్ర ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.. ఈ పాత్రలో నటించింది రసికా దుగ్గల్ అనే నటి. ఈ వెబ్ సిరీస్ లో ఈమె నటనకు ప్రత్యేక అభిమానులున్నారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ లో ప్రైమ్ లో  1,2 సీజన్ లతో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఈ వెబ్ సిరీస్ లో తనదైన శైలిలో నటించి అందరినీ ఆకర్షించారు రసిక దుగ్గల్. అయితే ఈ హిందీ భామ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు  ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. మన తెలుగు నిర్మాతలే ఈమె ప్రతిభను చూసి అవాక్కయ్యారట..

దీనితో ఎలాగైనా ఈ అమ్మాయిని తెలుగు లో నటింపచేయాలని ఆలోచిస్తున్నారని వినికిడి. ఈమెను కలిసి ఎంత పారితోషికమైనా ఇచ్చి తెలుగింట పరిచయం చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.  వేదిక ఏదైనా టాలెంట్ ఉంటే చాలు... మన స్థాయిని పెంచడానికి అంటున్నారు ఈ వార్త విన్న వారు. అయితే రసిక దుగ్గల్ ఎటువంటి పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి. ఈ వెబ్ సిరీస్ లో  ఫజల్‌, రసిక దుగ్గల్, పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి,  విజయ్‌ వర్మ, ప్రియన్షూ పేన్యూలీ, ఇషా తల్వార్‌లుహర్షితా శేఖర్‌, అమిత్‌ సియాల్‌, కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: