ప్రముఖ నటి మూవీ "బ్లాక్ రోజ్" ఆగిపోయిందా ?

VAMSI
బాలీవుడ్ హాట్ అండ్ బ్యూటిఫుల్ లేడీ ఊర్వశి రౌతేలా టాలీవుడ్ లో కూడా తన గ్లామర్ తో ప్రేక్షకులకు కనులువిందు చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. రెండుసార్లు మిస్ ఇండియా కిరీటాన్ని సాధించిన ఈ గార్జియస్ లేడీ సంపత్ నంది స్క్రిప్ట్ అందిస్తున్న బ్లాక్ రోజ్ మూవీ తో తెలుగులో గ్రాండ్ గ్లామరస్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. అయితే ఇప్పటి వరకు ఓ వైపు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, మరోవైపు ఐటెం సాంగ్స్ లతో ఆడియన్స్ ని అలరించిన ఈమె ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది స్క్రిప్ట్ అందిస్తున్న ఈ సినిమాకి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నవలా రచయిత షేక్స్పియర్ రచించిన "ది మర్చంట్ ఆఫ్ వెనిస్" లో షైలాక్ పాత్రను ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా బ్లాక్ రోజ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

తెలుగు, హిందీ రెండు బాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. విచక్షణ మరియు యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం అనే కౌటిల్యుడు అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్ ను జతచేసి బ్లాక్ రోజ్ ను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు సంపత్ నంది. ఈ మధ్య  ఈ సినిమాకి సంభందించిన పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఇందుకు మంచి రెస్పాన్స్ కూడా దక్కడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఏమైందో ఏమో గానీ కొన్ని రోజులుగాఈ సినిమా గురించి  ఎటువంటి అప్డేట్ లేదు. సంపత్ కూడా ఈ చిత్రం తదుపరి విషయాల గురించి చడీచప్పుడూ చేయకుండా ఉన్నారు.
 
దీంతో ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం మొదలయ్యింది. అటు నిర్మాత ఇటు దర్శకుడు ఈ సినిమా గురించి స్పందించకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది . పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి తమ అభిమాన అందాల తార ఊర్వశి ని తెలుగు తెరపై లీడ్ రోల్ లో చూసే చాన్స్ మిస్ అయినట్లేనా అంటూ ఫీల్ అవుతున్నారు ఆమె అభిమానులు. ఒకవేళ కరోనా వైరస్ కారణంగా తదుపరి పనులు జరగడం లేదా  అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి అసలు విషయం తెలియాలంటే చిత్ర బృందంలోని ఎవరో ఒకరు స్పందిచాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: