ఇంతకి ఇప్పుడు పవన్ ఏ సినిమాతో రాబోతున్నాడు?
ఇక ఈ మధ్యే పవన్కు కరోనా సోకడంతో కొన్నాళ్లు సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి.దీంతో మొత్తం ప్లానింగ్ మారింది అంటున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో 'అయ్యప్పనుమ్ కొషియమ్' రీమేక్, 'హరి హర వీరమల్లు' ఉన్నాయి. ఇవి కాకుండా హరీశ్ శంకర్ - మైత్రీ మూవీ మేకర్స్, సురేందర్ రెడ్డి - రామ్ తాళ్లూరి సినిమాలున్నాయి. లెక్క ప్రకారం చూస్తే… తొలుత 'అయ్యప్పనుమ్ కొషియమ్' రీమేక్ రావాలి.ఆ తర్వాత 'హరి హర వీరమల్లు' రావాలి. ఆ తర్వాత మిగిలినవి. నిర్మాతలు కూడా ఇదే ప్రకటించారు.
అయితే ఇప్పుడు ప్లాన్ మారిందట. 'హరి హర వీరమల్లు' బదులు హరీశ్ శంకర్ సినిమా లైన్లోకి తెస్తున్నారట. దానికి తగ్గట్టే పవన్ డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నారట 'అయ్యప్పనుమ్ కొషియమ్' రీమేక్ పనులు చివరిదశకొచ్చాయట. కాబట్టి దానిని ముందు ఫినిష్ చేసి, ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమా మొదలుపెడతారట. అంటే సంక్రాంతికి "హరి హర వీరమల్లు" బదులు హరీశ్ శంకర్ సినిమా రాబోతుందని సమాచారం. ఇక ఫ్యాన్స్ కూడా మొదట హరీష్ శంకర్ సినిమా వస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారట.ఎందుకంటే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ అలాంటి హిట్ ని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.