ఖిలాడీ నుండి ఫస్ట్ మెలోడీ రిలీజ్ డేట్ ఫిక్స్ ..... ??
ఇక ఈ మూవీ తరువాత మాస్ రాజా చేస్తున్న తాజా సినిమా ఖిలాడీ. యువ దర్శకుడు రమేష్ వర్మ తీస్తున్న ఈ సినిమా యాక్షన్ తో కూడిన కమర్షియల్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాలో లో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పెన్ మూవీ, ఏ స్టూడియోస్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ టీజర్ కి అందరి నుండి బాగా రెస్పాన్స్ లభించింది.
ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే జూన్ 7వ తేదీన ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని యూనిట్ విడుదల చేయనుందట. దేవిశ్రీ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుందని, త్వరలో దీనికి సంబంధించి అధికారిక న్యూస్ కూడా బయటకు రానుందని చెప్తున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే రవితేజ ఫ్యాన్స్ కి ఇది పండుగ న్యూస్ అనే చెప్పాలి ...... !!