సంచలనానికి ముందు సంయనం తప్పదు మరి ..... ??
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమా పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత అతి త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక మూవీ చేయనున్నారు మహేష్. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ నిర్మాతగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీగా రూపొందనున్న పాన్ ఇండియా సినిమాని మహేష్ చేయనున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి అది పూర్తయిన అనంతరం మహేష్ సినిమా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మహేష్ ఫ్యాన్స్ లో ఒకింత నిరాశ అయితే నెలకొంది. నిజానికి మహేష్ బాబు, రాజమౌళిల కాంబో సినిమా గురించి వారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా తీయడం మొదలుపెడితే అది రెండు నుంచి మూడు సంవత్సరాలుగా పైగా పట్టే అవకాశం ఉంది. గతంలో ఆయన తీసిన చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. కానీ రాజమౌళి నుండి సినిమా వస్తుంది అంటే మాత్రం అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అంతటి సంచలన విజయాన్ని తమ హీరో మూవీ అందుకోవాలంటే అంతకముందు కొన్నేళ్లపాటు మహేష్ ఫ్యాన్స్ సంయమనం పాటించక తప్పదు అంటున్నారు విశ్లేషకులు ..... !!