బుచ్చిబాబు పుష్ప వ్యాఖ్యల పై విమర్శలు !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఉన్న మూవీ ‘పుష్ప’. ఈమూవీకి సంబంధించి బయటకు వస్తున్న లీకులతో ‘బాహుబలి’ రేంజ్ లో ఈమూవీని ఊహించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో సుకుమార్ శిష్యుడు ‘ఉప్పెన’ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు ఈమధ్య ‘పుష్ప’ మూవీ గురించి చేసిన కామెంట్స్ పై విపరీతమైన సెటైర్లు పడుతున్నాయి.

తాను ఈమధ్యనే ‘పుష్ప’ మూవీ కొంత చూశానని ఆమూవీలోని సీన్స్ చూసిన తరువాత ‘పుష్ప’ 10 ‘కేజీ ఎఫ్’ లతో సమానం అన్న కామెంట్స్ పై ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ దాడి జరుగుతోంది. ‘కేజీ ఎఫ్’ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు కలెక్ట్ చేసిందని అలాంటి పరిస్థితులలో ‘పుష్ప’ ‘కేజీ ఎఫ్’ కంటే 10 రెట్లు ఎక్కువ అయితే ‘పుష్ప’ 2 వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా అంటూ కొందరు బుచ్చిబాబు కామెంట్స్ పై సెటైర్లు వేస్తున్నారు.

ఈమూవీకి సంబంధించి ఇప్పుడు బయటకు లీక్ అయిన మరొక విషయం బన్నీ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ‘పుష్ప’ మూవీలో స్టెల్లర్ బోట్ ఫైట్ అత్యంత కీలకంగా మారనున్నదట. ఈ బోట్ ఫైట్ ను చిత్రీకరించడానికి ప్రత్యేకమైన స్టంట్ కొరియో గ్రాఫర్లను సుకుమార్ ముంబాయ్ నుండి ప్రత్యేకంగా పిలిపించి ఈ ఫైట్ సీన్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బోట్ ఫైట్ చిత్రీకరించడానికి సుకుమార్ చాల ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ సీన్ ‘పుష్ప’ మూవీ పార్ట్ వన్ లో ఉంటుందని కేవలం ఈ ఒక్క సీన్ కోసమే బన్నీ అభిమానులు ఈ మూవీని ఒకటికి రెండు సార్లు చూసి తీరుతారు అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ మూవీకి బడ్జెట్ విపరీతంగా పెరిగి పోవడంతో ‘పుష్ప’ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న సుకుమార్ ఎట్టి పరిస్థితులలోను ఈమూవీని ఈ సంవత్సరాంతంలోగా విడుదల చేసి రికార్డులు క్రియేట్ చేసి చరిత్ర సృష్టిస్తుందని సుకుమార్ చాలగట్టి నమ్మకంలో ఉన్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: