ప్రేమ.. పెళ్లి.. 13రోజులకే యువతి బలవన్మరణం..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై అమింజికరైకు చెందిన భవానీశ్వరి అనే యువతి కార్తీక్ అనే అబ్బాయి ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకున్నారు. ఇక ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. వారి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పారు. కానీ ఇంట్లో వాళ్ళు వారి ప్రేమకు అంగీకారం తెలుపలేదు. దీంతో కార్తీక్ను పెళ్లి చేసుకోవడం కోసం.. భవానీశ్వరి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. వీరిద్దరు ఈ నెల మొదటి వారంలో వివాహం చేసుకున్నారు.
ఇక ప్రియుడితో కలిసి జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంది. కానీ కొద్ది రోజులకే ఆమె జీవితంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే పెళ్లైన వారం రోజులకే కార్తీక్, అతని కుటుంబ సభ్యులు భవానీశ్వరి వేధించడం మొదలుపెట్టారు. ఇక కట్నం కోసం ఆమెను మాటలతో నిందించారు. ఈ తరుణంలో భవానీశ్వరి తీవ్ర మనస్తాపం చెందింది. తన బాధను పంచుకోవడానికి నా అనుకున్న వాళ్ళు ఎవరు లేకపోవడంతో మానసికంగా కుంగిపోయింది.
అయితే ప్రేమించిన వాడి కోసం ఇంట్లో నుంచి పారిపోయి రావడంతో.. తిరిగి తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేకోయింది. ఈ తరుణంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. అనంతరం భవానీశ్వరి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.