ఇండస్ట్రీలో హీరోయిన్లు కొద్దిరోజుల పాటు ఊపేయడం ఆ తర్వాత అవకాశాలు లేక సతమతమవడం సాధారణమే. అయితే అవకాశాలు తగ్గటానికి అనేక కారణాలు ఉంటాయి. కొంతమంది భామలతో తీసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం లేదంటే వారు చెప్పే రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో దర్శకనిర్మాతలు కొత్త వారిని వెతుక్కుంటారు. ఇలా రకరకాల కారణాలతో హీరోయిన్ లకు అవకాశాలు తగ్గుముకం పడతాయి. ఇక ఇంతకాలం స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ ను షేక్ చేసిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్ వరుసగా బడా హీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా చేయడం లేదు.
అయితే తాజాగా ఇదే ప్రశ్నను ఇంటర్వ్యూలో అడగగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం తాను హిందీ చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా టాలీవుడ్ లో తనకు ఆఫర్లు తగ్గిపోయాయని అంగీకరిస్తున్నట్లు చెప్పింది. అయితే తాను బాలీవుడ్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ చేయాలని అదే తన డ్రీమ్ అని రకుల్ వెల్లడించింది. అంతేకాకుండా మరి కొన్ని ఇంట్రెస్టింగ్ రోల్స్ చేయాలని కూడా తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సంతోషంగానే ఉన్నానని చెప్పింది. రకుల్ మాటలు చూస్తుంటే టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినప్పటికీ బాలీవుడ్ లో ఒక్క కమర్షియల్ హిట్ కొడితే అక్కడే సెటిల్ అయిపోవచ్చు అని భావిస్తున్నట్టు అర్థం అవుతోంది.
ఇప్పటికే టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా తాప్సీ పన్ను టాలీవుడ్ నుండి వెళ్లి బాలీవుడ్ లో సెటిల్ అయింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా మారింది. అదేవిధంగా రకుల్ కూడా బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఒకవేళ హిట్ పడితే అక్కడే సెటిల్ అవుతుందామని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రస్తుతం ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ తో కొండ పొలం అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రకుల్ పల్లెటూరి పిల్లగా కనిపించనుంది.మరి బాలీవుడ్ పై మనసు పారేసుకున్న రకుల్ కు ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.