ఎప్పుడు లేనిది చిరు ఇంత అయోమయం లో ఉన్నాడేంటి?

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా ఆచార్య విషయంలో కొంత అయోమయం లో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా లేకపోతే మే నెలలో సినిమాను అనుకున్న విధంగా విడుదల చేసేవారు. కానీ ఈ మహమ్మారి ఒక్కసారిగా చిరంజీవి చేసిన ఆలోచన తారుమారు చేసింది. మే నెలలో కరోనా కేసులు ఎక్కువగా వస్తుండడంతో లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. దాంతో ఈ సినిమాను పోస్ట్ ఫోన్ చేయక తప్పలేదు. ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని కార్యకలాపాలు యధావిధిగా తెరుచుకున్నాయి. త్వరలోనే సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయి.

 ఈ నేపథ్యంలో ఆచార్య సినిమా ఎప్పుడు విడుదల చేయాలని డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. చిరు రీ ఎంట్రీ లో వరస సినిమాలు చేసుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. ఖైదీ నెంబర్ 150,  సైరా సినిమాలతో హిట్ జోష్ లో ఉన్న చిరంజీవి ఆ ఊపులోనే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాను మొదలు పెట్టాడు.కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా పూజాహెగ్డే ఆయన కు జోడీగా నటిస్తోంది. మెసేజ్ అండ్ కమర్షియల్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను భారీగా అందుకుంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల మేరకు ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి చిరంజీవి సన్నాహాలు చేశాడు. ఈ నేపథ్యంలో లో ఆ నెలలోనే ఇతర పెద్ద సినిమాలు కూడా రావడంతో తన సినిమాకి ఎక్కడ కలెక్షన్లు తగ్గుతాయో అన్న అనుమానం లో చిరంజీవి పడ్డారట. సోలోగా వచ్చిన పెద్ద సినిమాలు భారీగా కలెక్షన్లు సాధిస్తాయనే ఫార్ములా నమ్ముతున్న ఈ రోజుల్లో ఏ సినిమాకి పోటీ లేకుండా సోలోగా రావడానికి చిరంజీవి ఎప్పుడూ ఆచార్యకు మంచి ముహూర్తం ఫిక్స్ చేస్తారో చూడాలి. ఈ సినిమా తర్వాత చిరంజీవి 2 రీమేక్ సినిమాలను, ఒక తెలుగు స్ట్రెయిట్ సినిమాను లైన్ లో పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: