థియేటర్లు తెరిచినా పూర్వ వైభవం వచ్చేనా ?
దీనితో తెలుగు సినీ పరిశ్రమకు కాస్త ఊపిరి వచ్చినట్లయింది. కరోనాకు ముందు నిలిపివేసిన షూటింగ్ లను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ప్రశ్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ యాజమాన్యాల మనసులో మెదులుతూ ఉంటుంది. ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయిన సినిమాలన్నీ పూర్తయిన తరువాత థియేటర్ లో విడుదల చేస్తే ఎప్పటి లాగే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా ? ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇదే విధంగా లాక్ డౌన్ తరువాత సినిమాలు థియేటర్లలో విడుదల అయితే ప్రేక్షకులు బాగానే వచ్చారు.
కానీ ఆ తర్వాత సెకండ్ వేవ్ పేరుతో కరోనా రావడంతో, సగటు మానవుడు లాక్ డౌన్ తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని ఆలోచించాడు. ఈ సందర్భంలో ప్రజలు పూర్వములాగే థియేటర్లకు తండోపతండాలుగా వచ్చి సినిమాలను అదరిస్తారా అన్న ఆలోచనలో పడ్డారు. లేదా కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉండడంతో ముందు జాగ్రతగా థియేటర్ లకు రాకుండా ఉంటారా తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంలో ప్రేక్షకులు ఈ విధమైన తీర్పును ఇవ్వనున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.