బాలీవుడ్ సినిమాల్లో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ అదే రేంజ్ లో కామెడీని కూడా చూపిస్తూ ఎన్నో విజయాలు అందుకున్న దర్శకులలో రోహిత్ శెట్టి ఒకడు. రోహిత్ శెట్టి దర్శకుడిగా అయినంత సక్సెస్ నిజ జీవితంలో మాత్రం కాలేకపోయాడు. దానికి కారణం ప్రేమ ,పెళ్లి అనే రెండు విషయాలేనని చెప్పొచ్చు. రోహిత్ శెట్టి ది పెద్దలు కుదిర్చిన వివాహం అతని భార్య పేరు 'మాయ' వీరికి కుమారుడు కూడా ఉన్నాడు. వీరి దాంపత్యం అన్యోన్య దాంపత్యం కాకపోయినా మరీ విడిపోయేన్ని గొడవలు లేవనే చెప్పాలి. వీరి జీవితం ఇలా సాగుతున్న సమయంలో రోహిత్ శెట్టి ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు. అజయ్ దేవ్ గన్ ,అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'బోల్ బచ్చన్' అనే సినిమాకు 'రోహిత్ శెట్టి' దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ కు చెల్లి గా నటించడానికి మొదట జెనీలియాను తీసుకున్నారు. అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు సడెన్ గా జనీలియా సినిమా నుంచి తప్పుకుంది. దీంతో రోహిత్ శెట్టి ఆ పాత్రకు ప్రాచీదేశాయ్ ని తీసుకున్నాడు. ఈ హీరోయిన్ అప్పటికే 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' అనే సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించింది.
ఇక బోల్ బచ్చన్ సినిమా షూటింగ్ సమయంలో ప్రాచీ దేశాయ్ తో రోహిత్ శెట్టి ప్రేమలో పడిపోయాడు. మొదట్లో ప్రాచీ దేశాయ్ కూడా చనువు గానే ఉంది. కానీ ఆ తర్వాత రోహిత్ శెట్టి కి వివాహమైందని.... ఒక కుమారుడు కూడా ఉన్నాడని తెలిసి దూరంగా ఉండటం మొదలు పెట్టింది. దాంతో రోహిత్శెట్టి తన భార్యతో ఎప్పటినుండో మనస్పర్థలు ఉన్నాయని నువ్వు నాతో ఉండకపోయినా...భార్యతో విడిగా ఉందామని నిర్ణయించుకున్నానని చెప్పాడు. దాంతో ప్రాచీదేశాయ్ కన్విన్స్ అయింది. వెంటనే రోహిత్ శెట్టి తన భార్యకు విడాకుల నోటీసు పంపించాడు. కానీ ఆమె వాటి పై సంతకం చేయలేదు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం....ప్రాచీదేశాయ్ వల్లనే రోహిత్ శెట్టి భార్యకు దూరమయ్యాడని ప్రచారం జరగటంతో ప్రాచీ దేశాయ్ కూడా రోహిత్ శెట్టిని దూరం పెట్టడం మొదలు పెట్టింది. దాంతో ప్రస్తుతం రోహిత్ అటు భార్యకు ఇటు ప్రేయసికి దూరంగానే ఉంటున్నాడు.