టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల లిస్ట్ లో పూరి జగన్నాథ్ పేరు ఉండనే ఉంటుంది. మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఆన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీయడంలో ముందుంటారు. అయితే ఈయన ముద్దుల తనయుడు ఆకాష్ పూరిని కూడా హీరోగా అడుగులు వేయించిన విషయం తెలిసిందే. దాదాపుగా మూవీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారంతా సినీ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. అలాగే ఆకాష్ పూరి కూడా బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి తన యాక్షన్ తో అందరిని మెప్పించాడు. "ఆంధ్ర పోరి" సినిమాతో తొలిసారిగా ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. ఇక "మెహబూబ్" చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ ఈ సినిమా ఊహించని రీతిలో డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఇప్పుడు ఆకాష్ పూరి చేస్తున్న మూడో చిత్రం "రొమాంటిక్".
ఈ సినిమా ద్వారా ఢిల్లీ భామ కేతిక శర్మ తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రానికి కరోనా కారణంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మూవీకి పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించగా..ఆయన ప్రియ శిష్యుడు అనిల్ పాదూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. ఇక ప్రస్తుతం ఆకాష్ పూరి జార్జి రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో "చోర్ బజార్" చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో పవర్ఫుల్ కథకు హీరో ఆకాష్ పూరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఓ యువ దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో పూరి జగన్నాథ్, తనయుడు ఆకాష్ పూరిని ఈ సినిమా చేయాల్సిందిగా కోరాడట.
తండ్రి చెప్పడంతో ఆయన డైరెక్టర్ కి ఓకే చెప్పేశాడట ఆకాష్. ఈ సినిమాలో ఆకాష్ పూరి ఓ యువ పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారట డైరెక్ట్. మరి ఈ వార్త నిజమేనా సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న వివరాలు తెలుసుకోవడం కోసం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.