అభిరామ్ సినిమా మొదలయింది.. టైటిల్ ఏంటంటే?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ఇప్పటికే హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వెండితెరకు హీరోగా పరిచయం కానున్నాడు. అతడే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు, దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్.గత కొద్ది రోజులుగా అభిరామ్ సినీ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఫైనల్ గా దర్శకుడు తేజ అభిరామ్ ని హీరోగా తెలుగు తెరకు పరిచయం చేయనున్నాడు.అయితే అభిరామ్ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది ని హీరోగా లాంచ్ చేయనున్నాడని వార్తలు వినిపించాయి.కానీ వాటిపై క్లారిటీ రాలేదు.


ఈ నేపథ్యంలో దగ్గుబాటి వారసుడ్ని లాంచ్ చేయడానికి రెడీ అయ్యాడు తేజ. ఇక తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి సంబంధించి ఈ రోజు పూజా కార్యక్రమాలు జరిగాయి.కంప్లీట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'అహింస'అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.ఈ సినిమాలో అభిరామ్ సరసన ఇటీవలే ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా మారిన కృతి శెట్టి చెల్లెలు నుపూర్ సనన్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఓ ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా ఫేమస్ అయిన నుపూర్ సనన్ ఈ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయం కానుందని అంటున్నారు.ఇక ఈ సినిమాకి తేజ ఆస్థాన సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ స్వరాలు సమకూరుస్తున్నారు.


వీరిద్దరిది కాంబినేషన్లో వచ్చిన గత సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇక ఇటీవల దగ్గుబాటి రానా కి నేనే రాజు నేనే మంత్రి వంటి పక్కా కమర్షియల్ హిట్ అందించి.. మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు దర్శకుడు తేజ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఇక ఇప్పుడు మరో దగ్గుబాటి వారసుడు అభిరామ్ కి తేజ ఎలాంటి హిట్ ఇస్తాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.ఇక సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: