బంధాన్ని తెంచుకుని లక్షల్లో నష్టపోయిన స్టార్ హీరోలు వీళ్లే...!

VUYYURU SUBHASH
సాధారణంగా మన సినీ ఇండస్ట్రీలో హాలీవుడ్ , బాలీవుడ్ , టాలీవుడ్ అని తేడా లేకుండా  చాలామంది తమకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లిళ్లు చేసుకొని, కష్టం కలిగినప్పుడు భరించడం కంటే విడిపోవడమే మంచిదని, అలా ఎంతో మంది స్టార్ హీరోలు తమ భార్యలతో విడిపోయారు. ఇక అంతే కాదు వారికి కొన్ని కోట్ల రూపాయల భరణాన్ని చెల్లించి మరీ, వారికి దూరమయ్యారు. అయితే అలా మన సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు తమ భార్యలకు కోట్ల రూపాయలలో భారీ భరణాన్ని ఇచ్చి, వారిని దూరం చేసుకున్నారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1. ప్రభుదేవా - రామలత్ :
మంచి కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవా అప్పట్లో విడాకుల వ్యవహారం పెద్ద చర్చగా మారింది. ఆయన స్టార్ హీరోయిన్ నయనతార తో ఎఫైర్ పెట్టుకోవడంతో, ఆయన భార్య రమలత్ తో విడాకులు కూడా తీసుకున్నారు. ఇక అంతే కాదు ఆమెకు పది లక్షల రూపాయల నగదును ఇవ్వడంతోపాటు, రెండు మంచి ఖరీదైన కార్లు అలాగే 25 కోట్ల రూపాయల విలువగల  ఆస్తులను కూడా ఆమె పేరు మీద ప్రభుదేవా రాసినట్లు ప్రచారం జరిగింది.

2. సంజయ్ కపూర్ - కరిష్మా కపూర్:
బాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన  సంజయ్ కపూర్ అలాగే కరిష్మా కపూర్ లు కూడా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విడాకులు ఇచ్చేటప్పుడు సంజయ్ కపూర్, కరిష్మా కపూర్ పిల్లలకు 14 కోట్ల రూపాయల విలువైన వెహికల్స్ ను  వారి పిల్లల పేరుతో కొనుగోలు చేసి  ఉంచినట్లు సమాచారం. ఇక అంతే కాదు వాటిపై నెలకు పది లక్షల దాకా వడ్డీ కూడా వస్తుందట. అలాగే  ముంబైలో ఒక ఖరీదైన ఇంటిని కూడా ఇచ్చారు.

3. హృతిక్ రోషన్  - సుస్సాన్ ఖాన్:
హృతిక్ రోషన్ తన భార్యతో దాదాపు పది సంవత్సరాల పాటు జీవితం కొనసాగించి , ఇక ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు . అయితే ఏదో కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం కూడా జరిగింది. ఆమెకు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు హృతిక్ రోషన్.

కార్డ్ హృతిక్ రోషన్ తన భార్యకు రూ.5 కోట్లు, సంజయ్ కపూర్ - రూ.14 కోట్ల విలువగల వెహికల్స్, ప్రభుదేవా - రూ. 25 కోట్ల విలువైన ఆస్తి, రూ. 10 లక్షల నగదు ఇచ్చి వీరి భార్యలను దూరం చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: