రాంచరణ్ -శంకర్ మూవీ అక్టోబర్ లో ప్రారంభం?

murali krishna
రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్  లో దిల్ రాజు నిర్మాత  గా ఒక మూవీ  తెరకెక్కబోతోంది అన్న విషయం  తెలిసిందే! రాంచరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో  కలిసి  RRR మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభించి ఇప్పటికే రెండున్నర ఏళ్ళు పూర్తి  అయింది. రాంచరణ్ 2019 లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ  సినిమాతో  ప్రేక్షకులను పలుకరించాడు.కానీ ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. rrr ప్రారంభం అయి మధ్యలో కరోనా  రావడంతో సినిమా షూటింగ్  కొన్ని నెలలు ఆగిపోయింది. కరోనా తగ్గుముఖం పట్టగానే సినిమా షూటింగ్  ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే గ్యాప్ లో రాంచరణ్ చిరంజీవి, కొరటాల  మూవీ  ఆచార్యలో ఒక  ముఖ్య పాత్రలో నటించాడు. ఆచార్య సినిమా షూటింగ్  కూడా దాదాపు పూర్తికావస్తుంది.ఈ రెండు షూటింగ్స్ పూర్తి  కాగానే రాంచరణ్  శంకర్  మూవీని మొదలుపెడతాడు.

 శంకర్ కూడా భారతీయుడు -2 సినిమా వివాదంలో ఉండడంతో దానిని ఆపివేసి రాంచరణ్ తో  సినిమాను అనౌన్స్ చేసాడు. కానీ  కోర్ట్ సూచనలు మేరకు భారతీయుడు -2 మూవీని పూర్తి చేయాల్సి వచ్చింది. తాజాగా రాంచరణ్, శంకర్ సినిమా గురించి ఒక వైరల్ న్యూస్ చక్కెర్లు కొడుతోంది. అది ఏమిటంటే ఈ సినిమా బడ్జెట్ సుమారు 200 కోట్లకు పైగా ఉండబోతున్నట్లు  ఫిల్మ్ నగర్ లో టాక్. రీసెంట్ గా రాంచరణ్ శంకర్ గారిని కలవడం జరిగింది. ఈ సినిమా గురించి చాలా విషయాలు ఆగష్టు  లో అధికారికంగా  తెలియజేయడం  జరుగుతుంది  అని రాంచరణ్ పేర్కొనడం జరిగింది. రాంచరణ్ ఇప్పటికే rrr షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం  రామ్ చరణ్,అలియాభట్ పై ఒక పాట చిత్రికరణ జరుగుతుంది. రెండు పాటలు మినహా మిగిలినా టాకి  పార్ట్ పూర్తి అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా  రాంచరణ్  కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న "ఆచార్య " సినిమా  లో ఒక మఖ్య మైన పాత్రలో నటిస్తున్న రాంచరణ్ ఈ సినిమాలో 30 నిముషాలకు పైగా కనిపించునున్నాడట. శంకర్  భారతీయుడు-2 చిత్రం  పూర్తి అవగానే రాంచరణ్  సినిమా మొదకు పెట్టె అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: