అతని ద్వారా హాలీవుడ్ స్థాయికి సావిత్రి ఖ్యాతి..
మహానటి సావిత్రి - జెమిని గణేషన్ దంపతులకు విజయ చాముండేశ్వరి, సతీష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సతీష్ సినీ ఇండస్ట్రీ లోకి రావాలని ఆసక్తి కూడా లేదు. ఇక సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాత్రం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా, పెద్దగా రాణించలేక పోయింది. ఇక ఇప్పుడు విజయచాముండేశ్వరి రెండవ కుమారుడు అభినయ్ మాత్రం వెండితెరపైకి అడుగులు వేశారు. ఇక సావిత్రి వారసుడిగా సినీ ఇండస్ట్రీలో, సినీ ప్రముఖుల మన్ననలు కూడా పొందుతున్నాడు అభినయ్.
అయితే ఇతను సావిత్రికి వారసుడు అని చాలామందికి తెలియదు. కానీ ఇతను మాత్రం .."మా అమ్మమ్మకు వారసుడిగా మారుతాను. మా అమ్మమ్మ ఖ్యాతిని ప్రపంచమంతటా నిలబెడతానని .." చెప్పుకొస్తున్నాడు అభినయ్. ఇక దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన యంగ్ ఇండియా సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అభినయ్. ఇక టేబుల్ టెన్నిస్ క్రీడలో తమిళనాడు తరఫున కూడా పాల్గొన్నాడు. చెన్నై లో డిగ్రీ పట్టా అందుకుని ఉన్నత చదువులకోసం యూకే వెళ్లాడు. ఇక అక్కడ ఎంఎస్ పూర్తి చేశాడు.
ఇక ఆ తర్వాత రజనీకాంత్ , మెగాస్టార్ చిరంజీవి లను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారట. ఆ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ లు కూడా మంచి స్నేహితులుగా మారారు అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు వారి అమ్మమ్మ - తాతయ్యల ఇమేజ్ ను ఉపయోగించుకొని, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఆలోచన , తనకు లేదని కూడా చెప్పుకొచ్చాడు. ఇకపోతే వారి పెద్దమ్మ రేఖ కూడా హిందీ సినిమాల్లో నటించమని చెప్పిందట. ఇక కోలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించి, హాలీవుడ్లో ..ఇటీవల తెరకెక్కిన భారత గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్ బయోపిక్ ఆధారంగా , తెరకెక్కిన హాలీవుడ్ చిత్రంలో నటించాడు. ఇక అక్కడ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఎలాగైనా సరే తెలుగులో కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని, సావిత్రి వారసుడిగా గుర్తింపు తెచ్చుకోవాలి అనేది తన కోరిక అట.