ఎన్టీఆర్ తో దూరం అందుకే.. రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్..

Purushottham Vinay
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలాంటిదనేది ప్రతి ఒక్క సెలబ్రిటీ చెబుతుంటారు. అతని తోటి హీరోలు ఇంకా నటీనటులతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్ మెయిన్‌టైన్ చేయడం మన తారక రాముడు నైజం.ఇక ఇప్పటికే చాలా మంది నటీనటులు ఈ విషయం చెప్పడం జరిగింది.కాకపోతే జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహం ఎంతో ప్రత్యేకమైందని భావిస్తుంటారు జనం. ఇక ఎన్టీఆర్ నటించిన దాదాపు ప్రతి సినిమాల్లో కూడా రాజీవ్ రోల్ అనేది చాలా కీలకంగా ఉండటం ఇందుకు ఒక ప్రధాన కారణం. ఇక ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో గ్యాప్ రావడంపై రాజీవ్ కనకాల ఓపెన్ అవ్వడం జరిగింది.


ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించిన ''స్టూడెంట్ నెం.1 ఇంకా ఆది, నాగ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్'' లాంటి చిత్రాల్లో రాజీవ్ కనకాల మంచి ప్రత్యేకమైన కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఎప్పుడూ స్నేహంగా ఉంటూ మంచి మంచి పార్టీలు చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుండే రాజీవ్, తారక్ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది.ఇక ఇదే విషయమై ఇంటర్వ్యూలో ప్రస్తావన రాగా.. రాజీవ్ కనకాల ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది.ఎన్టీఆర్ చాలా ఫ్రెండ్లీ క్యారెక్టర్ అని, తానొక్కడినే కాదు ఇంకో 15 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఆయనకున్నారని రాజీవ్ చెప్పారు. ఫ్రెండ్ షిప్ చేస్తే ప్రాణమిచ్చే వ్యక్తి తారక్ అని రాజీవ్ తెలిపాడు.తారక్‌తో ఎంత టైమైనా సరే..చాలా సరదాగా గడుస్తుందని చెప్పిన రాజీవ్ కనకాల, ఓవర్ నైట్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి స్పెండ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన చెప్పారు.ఇక పెళ్లి తర్వాత కూడా తారక్ ని 24 గంటలు అంటి పెట్టుకుని ఉంటే బాగుందడు కదా.. అందుకే తమ మధ్య కొంచెం గ్యాప్ అనేది వచ్చిందని,ఇక అయినప్పటీకీ ఏ మాత్రం టైం దొరికినా ఇద్దరం కలుస్తుంటామని రాజీవ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: