అనకాపల్లి టు చెన్నై... ఆ స్టార్ విలన్ను పెళ్లాడిన హీరోయిన్ ?
తండ్రి ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె చెన్నై వెళ్లారు. బాలనటిగా ఎస్వీఆర్ - సావిత్రి - ఎన్టీఆర్ పక్కన ఎన్నో సినిమాల్లో నటించారు. బాలనటిగా 150కు పైగా సినిమాలు చేసిన ఘనత రోహిణి కి మాత్రమే దక్కింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారిన ఆమె తెలుగు , తమిళ , కన్నడ, మలయాళంలో 80కి పైగా సినిమాల్లో నటించారు. రోహిణి తన కెరీర్లో మొత్తం 350 సినిమాల్లో ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. ఆ సమయంలో లో సౌత్ ఇండియాలోనే విలన్ పాత్రలు పోషించడం లో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రఘువరన్ తో ఆమె ప్రేమలో పడ్డారు.
కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్న అనంతరం ఈ జంట 1996లో వివాహం చేసుకున్నారు. రఘువరన్ - రోహిణి దంపతులకు రిషివరన్ అనే బాబు జన్మించాడు. అయితే ఆ తర్వాత రఘువరన్ విపరీతమైన తాగుడుకు బానిస కావడంతో రోహిణి ఆయన నుంచి 2004లో విడిపోయారు. ఆ తర్వాత రఘువరన్ అనారోగ్యంతో మృతి చెందినా రోహిణి మాత్రం తన భర్త పై ఉన్న గౌరవం తో మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం కుమారుడు రిషివరన్ అమెరికాలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు.