మహేష్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వనున్న జక్కన్న... ?

VAMSI

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్నది ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పుడు ఇతని దర్శకత్వంలో 'రణం రౌద్రం రుదిరం' అనే టైటిల్ తో మల్టీ స్టారర్ మూవీని తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూ లో దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా తీయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను, అయితే ఇపుడు మహితో చిత్రాన్ని 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తరవాత ప్లాన్ చేయాలని చెప్పుకొచ్చారు. అయితే ఇపుడు 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పూర్తి కాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి మహేష్ బాబు తో జక్కన్న మూవీ మొదలుపెడతారా అన్న అంశంపై ఉంది.
అందులోనూ ఆగస్ట్ 9 వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు రాబోతున్న క్రమంలో ఈ విషయంపై  అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని అందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇంకో వైపు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు చర్చలు జరుగుతున్నాయని మహేష్ బర్త్డే రోజున అవన్నీ రివీల్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేయబోతున్నారని వార్తలు వినబడుతున్నాయి. మరి అందరూ ఊహించిన విధంగానే ప్రతిష్టాత్మక దర్శకుడు రాజమౌళి మరియు మహేష్ బాబుల కాంబో గురించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఇప్పటికే వీరిద్దరి సినిమాపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ సినిమాకు కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారని వినికిడి. ఈ కథ కూడా ఒక కౌ బాయ్ బెపద్యంలో సాగుతుందని గాసిప్ వినిపిస్తోంది.కానీ ఇప్పటి వరకైతే ఎటువంటి ప్రకటన లేదు. కాగా మహేష్ 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాకు పరుశురాం డైరెక్టర్ గా ఉన్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: