బాలయ్య ఇచ్చిన షాక్ కి చిరంజీవి, వెంకటేష్ ఎప్పటకీ మర్చిపోలేరా ?
2001 సంవత్సరంలో టాలీవుడ్ చరిత్రలోనే ఎవరు ఊహించని సంచలనం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి , యువరత్న నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ ముగ్గురు తమ సినిమాలతో బాక్సాఫీసు దగ్గర పోటీపడ్డారు. బాలయ్య - బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన నరసింహ నాయుడు , చిరంజీవి - గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన మృగరాజు , వెంకటేష్ - కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన దేవిపుత్రుడు సినిమాలు ఆ సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చాయి. జనవరి 11న మృగరాజు, నరసింహనాయుడు పోటాపోటీగా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. మృగరాజు పై భారీ అంచనాలు ఉన్నాయి. అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న బాలయ్య నటించిన నరసింహనాయుడు పై ఎలాంటి అంచనాలు లేవు.
అయితే నరసింహనాయుడు గోల్డెన్ జూబ్లీ సినిమా అయ్యింది. అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులకు పాతర వేసింది. మృగరాజు చిరంజీవి కెరీర్ లోనే పెద్ద మాయని మచ్చగా మిగిలిపోయింది. జనవరి 14న రిలీజ్ అయిన దేవిపుత్రుడు భారీ బడ్జెట్ తో తెరకెక్కి అంచనాలు అందుకోలేక పోయింది. ఈ సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చింది. ఏదేమైనా ఇప్పటికీ ఆ మూడు సినిమాల పోటీ గురించి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చర్చించుకుంటూ ఉంటారు. బాలయ్య నరసింహనాయుడు దెబ్బతో బాక్సాఫీస్ వద్ద మృగరాజు, దేవి పుత్రుడు అడ్రస్ లేకుండా పోయాయి.