ఆమె కోసం కన్నీరు కార్చిన పరుచూరి.. కారణం..!

Divya
ప్రముఖ రచయిత గా గుర్తింపు పొందిన పరుచూరి ఆమె కోసం కన్నీరు పెట్టుకునేవారట. ఆమె ఎవరో కాదు రమాప్రభ. సినీ ఇండస్ట్రీలో రమాప్రభ అంటే హాస్యనటిగా, హీరోయిన్లకు అక్కగా, స్నేహితురాలిగా, అప్పట్లోనే నటించింది రమాప్రభ. ఈమె ఎటువంటి క్యారెక్టర్ కైనా ప్రాణం పోసి చేయగలరు. కానీ అలాంటి ఆమె నటనకు దూరం అయింది అంటే చాలా బాధపడుతున్నారు పరుచూరి గోపాలకృష్ణ.ఆ విషయాలు ఏంటో చూద్దాం.
పరుచూరి బ్రదర్స్ రమాప్రభ ని ఎందుకు ఎంచుకున్నారు అంటే , ఆమె దాదాపుగా ఇప్పటివరకు 1000 సినిమాలలో తనదైన శైలిలో పాత్రలు వేసి,  అందరినీ అలరించింది. ఇక అదే దశలో నిర్మలమ్మ, అన్నపూర్ణమ్మ ఎలా చేసేవారో,  తను కూడా అలాగే చేసేది అంటూ చెప్పుకొచ్చారు పరుచూరి. ఈమె మాటల్లోనే హాస్యం ఉందంటూ తెలియజేశారు.
ఈమె నటించిన కథానాయకుడు సినిమాలో ఒక సన్నివేశం లో,  ఈమె చంకలో పిల్లవాడిని పెట్టుకొని వచ్చే పాత్ర ఆ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక రేపటి రాజ్యం సినిమాలో రమాప్రభ విలన్ గా నటించింది. అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక రోజు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఒక ఆర్టిస్ట్ చాలా ఆలస్యంగా వచ్చింది. తనని రమాప్రభ ఎందుకు ఆలస్యంగా వచ్చారు సోదరి అని అడగ్గా.. ఆమె చెప్పకూడని మాట ఒకటి చెప్పడంతో.."తన కళ్ళల్లో కన్నీరు వచ్చాయట."
సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి రూమర్స్ ఎక్కడ ఉండవు. ఒకటి, రెండు  సినిమాలలో  ఇద్దరు కలిసి తీస్తే, వారిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అన్నట్లు అందరూ అభిప్రాయపడతారు అని రమప్రభ పరుచూరి తో  తెలిపింది. రాజబాబు తో రమాప్రభ ఎన్నో సినిమాలలో కలిసి నటించింది. వీరిద్దరు సినిమాలో ఉన్నారంటే ఎంతో కామెడీ గా సాగిపోతుంది ఆ సినిమా. ఆవిడ ప్రస్తుతం ఎక్కడ లేకుండా తమ సొంత ఊరిలో ఉన్నారు అని తెలిసినప్పుడు, అలా నాకు చాలా బాధ వేసింది  అని చెప్పుకొచ్చాడు పరుచూరి.
రమాప్రభ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే తమ ఇల్లు ఉంటుందని తెలిపాడు ఆయన, అంతేకాకుండా శరత్ బాబు-రమ ప్రభ విడిపోవడం కూడా అది ఒక చేదు జ్ఞాపకంగా భావిస్తున్నానని తెలిపాడు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: