'పుష్ప' సినిమాకు అదే రిపీట్ అవుతుందా..?

Pulgam Srinivas
తెలుగు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా, దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం 'ఆర్య' సినిమా తో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా కథాకథనాలు ఎంత కొత్తవి గా ఉంటాయో, సంగీతం కూడా అంతే కొత్తగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమా కథ అప్పటికే ఒకరితో ప్రేమ లో ఉన్న అమ్మాయిని హీరో ప్రేమించడం ఇలాంటి కథకు మామూలు సంగీతం ఉంటే అది సినిమాపై పెద్దగా ప్రభావం చూపదు. అందుకోసం దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ఫీల్ మై లవ్ అనే పాట ఇప్పటికీ జనాలను ఉర్రూతలూగిస్తున్న ఉంది. ఈ పాట తో పాటు ఆ అంటే అమలాపురం అనే ఐటమ్ సాంగ్ తో కూడా సుకుమార్ దేవిశ్రీప్రసాద్ కలిసి మ్యాజిక్ చేశారు.



 
జగడం: సినిమా థియేటర్ల వద్ద నిరాశపరిచిన దేవిశ్రీ సమకూర్చిన సంగీతానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
ఆర్య టు: ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు హైలెట్ అని చెప్పవచ్చు.
100% లవ్: ఈ సినిమాలో నాగచైతన్య, తమన్న ఇద్దరు బావ మరదలు వీరిద్దరి మధ్య ఉన్న చదువు పోటీని, మరియు బంధాన్ని తెలిపే విధంగా దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది.
1 నేనొక్కడినే: ఈ సినిమా  థియేటర్ల వద్ద బోల్తా పడిన దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మాత్రం సినీ జనం నుండి  మంచి మార్కులే పడ్డాయి. 

నాన్నకు ప్రేమతో: ఈ సినిమా కథ ప్రకారం తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే విధంగా దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ఒక అద్భుతం అని చెప్పవచ్చు.



 
రంగస్థలం: ఈ సినిమా స్వచ్ఛమైన పల్లెటూరి నేపథ్యం కలిగినది. మరీ ముఖ్యంగా ఈ కథ 1980ల కాలంలో జరుగుతుంది.  ఇలాంటి కథకు చాలా జాగ్రత్తగా సంగీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బాధ్యతను దేవి శ్రీ ప్రసాద్ చాలా అద్భుతంగా నెరవేర్చాడు.
ఇలా ఇప్పటి వరకు సుకుమార్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'పుష్ప' సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈసారి కూడా ఎప్పటిలాగానే మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడు అని సినీజనం తో పాటు  ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి  'పుష్ప' సినిమా పాటలు జనాలకు ఏ రేంజ్ కిక్ ని ఇస్తాయో తెలియాలంటే సినిమా పాటలు విడుదల అయ్యే అంతవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: