ఎన్టీఆర్ త‌ల్లి షాలిని వ‌చ్చిన‌ ఫ‌స్ట్ సినిమా ఫంక్ష‌న్ ఇదే...!

VUYYURU SUBHASH
నంద‌మూరి హరికృష్ణ - షాలిని దంపతులకు ఎన్టీఆర్ మూడవ కుమారుడుగా జన్మించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తన తల్లి షాలిని ఇప్పటివరకు కేవలం కొన్ని సినిమా వేడుకలకు మాత్రమే హాజరైంది. అలా ఆమె మొదటి సారి ఎన్టీఆర్ సినిమా వేడుకకు ఎప్పుడు హాజరు అయిందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇకపోతే మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ , దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయో ఇప్పటికే చాలా మందికి తెలిసిందే.. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వ‌చ్చిన స్టూడెంట్ నెంబర్ వన్,  సింహాద్రి సినిమాలతో ఎన్టీఆర్ మంచి విజయాన్ని అందుకున్నారు అయితే వీరిద్దరి కాంబినేషన్లో మూడో సారి వచ్చిన సినిమా యమదొంగ.

ఈ మూవీ అప్పట్లోనే రూ.15 కోట్ల షేర్ ను బాక్సాఫీస్ వద్ద రాబట్టి , ఆల్ టైం హిట్ రికార్డును క్రియేట్ చేసింది. అంతే కాదు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, కేవలం ఈ సినిమా కోసం ఆపరేషన్ చేయించుకుని మరీ ఎన్టీఆర్ 30 కేజీల బరువు తగ్గాడు. ఈ సినిమాలో తన సరికొత్త లుక్ ను చూడటం కోసమే అభిమానులు తెగ ఎగబడ్డారు అని చెప్పవచ్చు. ఇక యమదొంగ సినిమా కి ముందు కృష్ణవంశీ డైరెక్షన్ లో లో ఎన్టీఆర్ రాఖీ సినిమాను తీయడం జరిగింది. అప్పటి వరకు చాలా లావుగా ఉన్న ఎన్టీఆర్, యమదొంగ సినిమా కోసం బరువు తగ్గడం విశేషం.

ఇక ఈ యమదొంగ  సినిమా కోసం  రామోజీ  ఫిలిం సిటీ లో 300 మంది కార్మికులు శ్రమించి, సెట్ వేయడం జరిగింది. ఇక  400 టన్నుల లైటింగ్ కూడా పెట్టారట. ఇక  ఇది అప్పట్లో ఒక వైరల్ గా మారిన విషయం. ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ , అలాగే మీరా చోప్రా లను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత వారిద్దరూ సినిమాను ఒప్పుకోక పోవడంతో , ఆ ప్లేస్ లో ప్రియమణి అలాగే మమతా మోహన్ దాస్ లు కలిసి  నటించి, సినిమాను హిట్  చేశారు. ఇక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ తల్లి షాలిని హాజరుకావడం అప్పట్లో విశేషంగా చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: