మోహ‌న్‌బాబు లాంటి విల‌న్ ప‌క్క‌న హీరోయిన్‌గా... నో చెప్పిన‌ న‌టిమ‌ణి ?

VUYYURU SUBHASH
టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుది నాలుగు దశాబ్దాల చరిత్ర. సినిమా రంగంలో రాణించాలని చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు నుంచి మద్రాసు వెళ్లిన మోహన్ బాబు సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు... ఆ తర్వాత విలన్గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోగా.... ఇలా అంచెలంచెలుగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. మోహన్ బాబు వార‌సులుగా వెండి తెరం గ్రేటం చేసిన‌ మంచు విష్ణు , మంచు మనోజ్ ఇద్దరు నేటితరం హీరోలుగా కొనసాగుతుంటే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న సైతం సినిమారంగంలోనూ.. ఇటు బుల్లితెరపై తండ్రికి తగ్గ తనయురాలిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

మోహన్ బాబు అసిస్టెంట్ దర్శకుడి నుంచి విలన్ గా మారారు. విలన్ గా ఆయన చెప్పే విలక్షణమైన డైలాగులు కు మంచి క్రేజ్ ఉండేది. దీంతో ఆయనకు కెరీర్ ఆరంభంలో విల‌న్‌ పాత్రలే ఎక్కువగా వచ్చాయి. స‌బ్ విల‌న్ నుంచి ఆయ‌న రెండో విల‌న్‌గా ఎదిగారు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా మారారు. అయితే అప్పటి వరకు విలన్ గా నటించిన ఆయన పక్కన హీరోయిన్ పాత్రలో నటించేందుకు ఎవరు ముందుకు వచ్చేవారు కాదట. అప్పట్లో హీరోయిన్ గా దూసుకుపోతున్న కవితను మోహన్ బాబు పక్కన హీరోయిన్‌గా నటించమని అడిగితే ఈ విలన్ పక్కన నేను హీరోయిన్ గా నటించాలా ? అని ప్ర‌శ్నించింద‌ట క‌విత‌.

అయితే ఎలాగోలా చివరకు ఆమెను ఒప్పించారు. ఆ సినిమా హిట్ అయ్యాక మోహన్‌బాబు - కవిత కాంబినేషన్లో నాలుగైదు సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత కవిత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఇటీవల కవిత భర్త, కుమారుడు పది రోజుల వ్యవధిలో క‌రోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: