బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాకి ఎన్టీఆర్ ఓకే చెబుతాడా..??

N.ANJI
చిత్ర పరిశ్రమలో సాధారణంగా ఒక హీరో రిజెక్ట్ చేసిన కథకు మరో హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరుగుతూనే ఉంటాయి. అలాంటివి ఎన్నో చూశాము. ఇక బాలయ్య రిజెక్ట్ చేసిన కథ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వినబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా రాఖీ. ఈ సినిమాలో ఇలియానా, ఛార్మి హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుండి అనుకునంతగా ఆదరణ పొందలేకపోయింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ఉంది.

అయితే రాఖీ తర్వాత ఎన్టీఆర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో మరో సినిమా ఇంతవరకు రాలేదు. ఇక మరోవైపు కృష్ణవంశీ కొన్నేళ్ల క్రితం రైతు అనే స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని బాలయ్యకు వినిపించిన సంగతి అందరికి తెలిసిన విదితమే. కాగా.. కొన్ని కారణాల వల్ల కథ నచ్చినా బాలయ్య ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటా. దాంతో కృష్ణవంశీ రైతు కథను ఎన్టీఆర్ కు చెప్పి ఒప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఇక కృష్ణవంశీ తారక్ మధ్య మంచి అనుబంధం ఉంది. అంతేకాక.. కథ నచ్చితే ఎన్టీఆర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఓకే చెప్పినా ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉందనే చెప్పాలి. అంతేకాక.. ఎన్టీఆర్ తరువాత సినిమాలకు దర్శకత్వం వహించే డైరెక్టర్ల జాబితాలో పలువురు స్టార్ డైరెక్టర్లు ఉన్న సంగతి తెలిసందే. ఇక కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉండగా ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: