అలాంటి సినిమాలకు స్వస్తి చెప్పనున్న రానా..?

Divya
టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. రానా, కాజల్ అగర్వాల్ తో కలిసి నటించిన చిత్రం"నేనే రాజు నేనే మంత్రి". ఈ సినిమా తప్ప ఆయన కెరీర్లో పెద్దగా సక్సెస్ అయిన సినిమాలు ఏవీ లేవు. ఇక బాహుబలిలో నటించిన రానా , ఆ సినిమాతో మంచి పేరు సంపాదించినా, ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు

ఇక రానా నక్సలిజం పాత్రలో నటిస్తున్న విరాటపర్వం సినిమా, థియేటర్లో విడుదల అవుతుందా..? లేక  ఓటీటీ లో రిలీజ్ చేయాలా ..? అనే విషయం పై సందిగ్ధంలో ఉన్నారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. కానీ ప్రస్తుతం రానా మటుకు పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ మూవీలో నటిస్తున్నారు. ఇకపై రానా కూడా కేవలం మల్టీస్టారర్ సినిమాల పైనే తన దృష్టి పెట్టనున్నారని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

ఇక భీమ్లా నాయక్ సినిమాకి త్రివిక్రమ్  మాటలు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో రానా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా,  కేవలం మల్టీస్టారర్ వంటి మూవీలోని మాత్రమే నటించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలోనే వెంకటేష్ రానాతో కలిసి ఒక వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా నాగచైతన్యతో కలిసి కూడా త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నట్లు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సంవత్సరంలో విడుదలైన అరణ్య మూవీ ఆశించిన ఫలితం రాకపోవడంతో రానా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడని తన అభిమానులు చెప్పుకొస్తున్నారు. రానాకి అరణ్య సినిమా వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇటీవల మల్టీస్టారర్ సినిమాలకి ప్రేక్షకులు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.. కాబట్టి హీరోలు కూడా మల్టీస్టారర్ మూవీలో చేస్తేనే ఆశించిన ఫలితాలను అందుకోవచ్చు.. అని పలువురు సినీ ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: