విశాల్ కు సపోర్ట్ ఇస్తున్న కోర్టు..?
నిజమైనప్పుడు న్యాయం పక్కనే నిలుస్తుంది అనే ఈ విషయాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను అని హీరో విశాల్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ విషయం ఇప్పుడు రుజువైంది అని చెప్పుకొచ్చాడు. విశాల్ తీసినటువంటి చక్ర అనే సినిమాపై...LYCA మీడియా సంస్థ తనపై ఒక తప్పుడు కేసు పెట్టింది.కానీ మద్రాస్ హైకోర్టు హీరో విశాల్ పై ఉన్న కేసును కొట్టేసింది.
అంతేకాకుండా ఇలాంటి కేసు పెట్టడం వల్ల నా పరువుకు భంగం కలిగించడంతో పాటు, ఇక కోర్టు సమయాన్ని కూడా వృథా చేసినందువల్ల వారికి.. రూ.4 నుంచి రూ.5 లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని హీరో విశాల్ తన సోషల్ మీడియా ద్వారా చెప్పడం జరిగింది ఇప్పుడు అది కాస్త చాలా వైరల్ గా మారుతోంది. ఇక అంతే కాకుండా విశాల్ నటించినటువంటి చక్ర సినిమా పూర్తి హక్కులు తనవే అంటూ ఒక నిర్మాత ఈ చిత్రం విడుదలకు ముందు కేసు వేయడం జరిగింది.
అంతేకాకుండా ఈ సినిమాని ఆపివేయాలి అంటూ చాలామంది, అడ్డుపడినా కూడా విశాల్ అవన్నీ పట్టించుకోకుండా విడుదల చేసి వాటికి సంబంధించిన ఫ్రూప్స్ ను కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. కానీ కోర్టు మటుకు ఈ విషయాలకు అనుకూలంగా తీర్పు నివ్వడం జరిగింది. ఆ నిర్మాత ఈ కేస్ ఇక్కడ ఓడిపోయినా, పైకోర్టు కి వెళ్తాను అంటూ.. విశాల్ ను హెచ్చరిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాసంస్థల ద్వారా తెలుస్తోంది.