యంగ్ హీరోలలో పెరిగిపోతున్న మల్టీ టాలెంట్ !

Seetha Sailaja
ఒకప్పుడు ఒక సినిమాకు దర్శకుడు దర్శకత్వాన్ని చూసుకుంటే రచయితలు ఆ దర్శకులు కోరిన విధంగా కథలు వ్రాసేవారు ఆకథకు ఎవరో ఒక హీరోతో తీసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో దర్శకులు రచయితలుగా హీరోలు రచయితలుగా నిర్మాతలు కూడ రచయితలుగా మారిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అందువల్లనే ప్రస్తుతం ఇండస్ట్రీలో రచయిత అన్న వ్యక్తి ప్రత్యేకంగా కనిపించకుండా దర్శకులలో హీరోలలో రచయితలు కనిపిస్తున్నారు.


ఒకప్పుడు ప్రముఖ రచయితలు అంటే పరుచూరి బ్రదర్స్ సత్యానంద్ జంధ్యాల లాంటి వాళ్ళు ఉండేవారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా హీరోలు రచయితలుగా మారిపోవడం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్. ఈ లిస్టులో అగ్ర స్థానంలో చెప్పుకోవలసింది యంగ్ హీరో అడవి శేషు గురించి. సూపర్ హిట్ అయిన ‘క్షణం’ మూవీకి అడవి శేషు కథ అందించాడు. ఆ తరువాత వచ్చిన ‘గూఢచారి’ మూవీకి కూడ అడవి శేషు రచయిత. దర్శకుడుగా కూడ మారి ఈ యంగ్ హీరో ప్రయోగాలు చేస్తున్నాడు.


ఇక ఈ లిస్టులో చెప్పుకోవలసింది విశ్వక్ సేన్ గురించి అతడు నటించిన ‘ఫలక్నుమా దాస్’ మూవీకి కథను ఇవ్వడమే కాకుండా అతడు తరువాత నటించిన సినిమాల కథల విషయంలో కూడ ఈ యంగ్ హీరో హస్తం ఉంది అంటారు. ఈ సంవత్సరం విడుదలై సంచలన విజయం సాధించిన ‘జాతిరత్నాలు’ సినిమా కథ స్క్రిప్ట్ విషయంలో హీరో నవీన్ పోలిశెట్టి హస్తం కూడ ఉంది. ఈమధ్యనే విడుదలైన ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ మూవీ కథను ఆ మూవీ హీరో కిరణ్ అబ్బవరం రచించిన విషయం తెలిసిందే.


ఇప్పటికే యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నాగశౌర్య ‘అశ్వద్దామ’ మూవీ కథను సమకూర్చాడు. త్వరలో విడుదల కాబోతున్న అతడి లేటెస్ట్ సినిమాల కథల విషయంలో కూడ అతడి హస్తం ఉంది అంటారు. ఇప్పటికే యంగ్ హీరోలు తమ టాలెంట్ ను అభివృద్ధి చేసుకుంటూ రకరకాల పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పుడు ఇలా రచయితలుగా కూడ వీరు మారిపోవడంతో వీరి మల్టీ టాలెంట్ వల్ల నూతన రచయితలకు అవకాశాలు లేకుండా పోయాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: