పారిపోయి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ !

Siva.K

హీరోయిన్లు అంటే గ్లామర్ డాల్స్ అని ఇండస్ట్రీలో ఒక చులకన ఉంటుంది. కానీ వారికి కూడా ఓ హృదయం ఉంటుంది, ఆ హృదయాలకు స్పందన ఉంటుంది. కానీ సహజంగా అమ్మాయిలకు ఆ స్పందన ఎక్కువగా హీరోల మీద పుడుతుంది, కానీ ఈ కింద హీరోయిన్స్ కి మాత్రం డైరెక్టర్ల మీద పుట్టింది. దర్శకుల ప్రేమలో పడి, వారిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబాన్నే వదులుకోవడానికి సిద్ధపడిన నటీమణులు గురించి..
 
  ఖుష్భూ :
 ఖుష్భూ ముందుగా  మాజీ హీరో  ప్రభుతో పీకల్లోతు ప్రేమలో మునిగి, చివరకు ఒంటరి అయింది. ఆ తరువాత   డైరెక్టర్ సి.సుందర్ ని  ఇష్టపడి 2000వ సంవత్సరంలో  పెళ్లి చేసుకుంది. ఈ పెళ్ళికి తన ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లి చేసుకుంది.    

రోజా ;  
రోజా ప్రేమ మరీ సినిమాటిక్.  అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే డైరెక్టర్ సెల్వమణిని  రోజా ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. 2002లో వీరు సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళికి కూడా మొదట  రోజా కుటుంబం అంగీకరించలేదు. తర్వాత అంతా కలిసిపోయారు.  
శోభ  :
అప్పటి క్లాసిక్ హీరోయిన్ శోభ, సీనియర్ టాప్ మోస్ట్ డైరెక్టర్ బాలు మహేంద్రతో ప్రేమలో పడి అందర్నీ ఎదిరించి అతన్నే పెళ్లి చేసుకుంది శోభ. అయితే, శోభతో బాలుమహేంద్ర వివాహాన్ని ఆయన కుటుంబం అసలు అంగీకరించలేదు. దాంతో శోభ పెళ్ళైన రెండేళ్లకే 1980లో సూసైడ్ చేసుకుని చనిపోయింది.

నటి శరణ్య :
శరణ్య  ప్రేమ కథ బోల్డ్ గానే సాగింది.  ఆమె డైరెక్టర్ పొన్ననన్ 1995లో తన ఫ్యామిలీకి ఇష్టం లేకుండా   వివాహం చేసుకుంది.
దేవయాని :
దేవయాని, డైరెక్టర్ రాజ్ కుమార్ తో పెళ్ళికి  ఫ్యామిలీని ఒప్పించడానికి మూడు ఏళ్ళు కష్టపడింది. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో  దేవయాని  2001లో సీక్రెట్ గా  రాజ్ కుమార్ నే  పెళ్లి చేసుకుంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: