మహేష్ సినిమా విషయం లో త్రివిక్రమ్ తెలివైన పని!!

P.Nishanth Kumar
టాలీవుడ్ మాటల మాంత్రికుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు రచయితగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి కాగా త్రివిక్రమ్ మహేష్ బాబు 28 వ సినిమాపై పని చేస్తున్నాడని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.  నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని భావించిన త్రివిక్రమ్ కథ పై మరింత కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబు తో తాను చేసిన రెండు సినిమాలకు మించి ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేశాడట.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తు ఉండగా దాదాపు 11 సంవత్సరముల తరువాత వీరిద్దరి కలయికలో సినిమా రాబోతూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండేలా చేస్తున్నాయి. అన్నిటికీ మించి అరవింద సమేత, అల వైకుంఠ పురం లో వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా.. అటు మహేష్ బాబు కూడా సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది ఈ సినిమాపై.

ఇక ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా కియార ను తీసుకుంటున్నారట. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ సోషల్ మీడియాలో వీరు ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పాటలతో ముందుగా సెట్స్ పైకి వెళ్ళాలి అని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ పాటలను చిత్రీకరించి ఆ తరువాత సినిమా షూటింగ్ కు వెళ్లాలని త్రివి క్రమ్ షెడ్యూల్ రెడీ చేశాడని తెలుస్తుంది. మరి ఈ పాటలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: