చాలా మంది హీరోయిన్లు కెరీర్ మొదట్లో ఊపేస్తారు. ఆ తరవాత అవాకాశాల్లేక ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లడమో లేదంటే ఇక్కడే బడా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడమో చేస్తుంటారు. కానీ ముందు ఊపేసి ఆ తరవాత అవకాశాల్లేక పెళ్లి చేసుకుని మళ్లీ ఇండస్ట్రీలో బిజీగా మారే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. టాలీవుడ్ గ్లామర్ క్వీన్ ప్రియ మణి కూడా అందులో ఒకరనే చెప్పాలి. ప్రియమణి కెరీర్ మొదట్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
కానీ ఎంత త్వరగా ప్రియమణి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిందో అంతే త్వరగా డౌన్ ఫాల్ అయ్యింది. చాలా కాలం పాటు అవకాశాల కోసం సతమతం అయ్యింది. ఓ సారి జూనియన్ ఎన్టీఆర్ ను అవకాశాల కోసం అడుగుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక కెరీర్ అంతంత మాత్రంగా ఉండటంతో పెళ్లి చేసుకుని భర్తతో సెటిల్ అవ్వాలని అనకుంది ప్రియమణి. అయితే పెళ్లి చేసుకున్న తరవాత ప్రియమణిని వెతుక్కుంటూ అవకాశాలు రావడంతో మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సీరీస్ లలో నటిస్తూ ప్రియమణి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. చిన్న పిల్లలకే కాకుండా ఎదిగిన బిడ్డలున్న తల్లి పాత్రలో నటించి వావ్ అనిపిస్తోంది.
ఇటీవల ప్రియమణి నారప్ప సినిమాలో చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా అప్పట్లో దృవ సినిమాలో ప్రియమణి బికనీ షోతో మైండ్ బ్లాక్ చేసింది. అయితే అప్పట్లో బికినీ వేసుకేనేందుకు ప్రియమణి చాలా పుచ్చుకుందని..నిర్మాత బలవంతంతో బికినీ వేసుకునేందుకు ఒప్పుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దృవ సినిమా నిర్మాత డీఎస్ రావు ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ప్రియమణిని దర్శకుడు సినిమాలో బికినీ వేసుకోవాలని కోరడంతో తన తల్లితో మాట్లాడి చెబుతా అని ఐదు నిమిషాల్లో ఓకే చెప్పిందన్నారు. అంతే కాకుండా ప్రియమణి బికినీ వేసుకునేందుకు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదన్నారు.