తెలుగు ప్రేక్షకులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. కొన్ని పోస్ట్ ప్రోడక్షన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది చిత్ర బృందం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నెక్ట్స్ ప్లాన్ ఏంటి ? ఏ హీరో ను టార్గెట్ చేశారు.. అనే ప్రశ్న అందరిలోనూ రావడం కామన్ అయిపోయింది. అయితే.. ఇలాంటి తరుణ ంలోనే మన జక్కన్న ఫేమస్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ను సీక్రెట్ గా కలిశారట.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు జక్కన్న కాంబో లో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇక వీరి ద్దరీ కాంబి నేషన్ లో వచ్చే మూవీని.. చిత్ర పరిశ్రమ లో ఎప్పుడూ తీయని విధంగా... తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతే కాదు.. ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో చేయాలని ఫైనల్ అయ్యారట. అయితే.... ఇప్పటి కైతే... ఈ కొత్త సినిమా ప్రాజెక్టు పై ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయట.... కానీ దీని పై అతి త్వరలోనే అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థమవు తోంది. అయితే.. ఈ ప్రకటన ఎప్పుడూ.. ఎలా వస్తుందో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.
అయితే... ఈ ప్రాజెక్ట్ ను ఏ హీరో తో చేస్తారనేది కూడా పెద్ద డౌట్ గా మిగిలింది. కానీ మహేష్ బాబు తో నెక్ట్స్ సినిమా చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట. ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే.. అదే పనిలో ఉండనున్నారు రాజమౌళి. అయితే... ఈ భారీ ప్రాజెక్ట్ లో మహేష్ బాబే హీరో గా ఉంటారా...లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా.. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా తో మహేష్ బాబు బీజీగా ఉన్నారు. ఆ సినిమా అనంతరం త్రివిక్రమ్ తో చేయనున్నారు. మరి త్రివిక్రమ్ సినిమా అయ్యే వరకు... రాజమౌళి వెయిట్ చేస్తారా ? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.