టాలీవుడ్ డ్రగ్స్: ఇక విచారణ ముగిసినట్టేనా...?
సెప్టెంబర్ 6 న హాజరు కావాల్సి ఉండగా సెప్టెంబర్ 3 నే హాజరు రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు వచ్చింది. సెప్టెంబర్ 3 న రకుల్ ను 6 గంటల పాటు విచారించిన ఈడి... ఆ తర్వాత నందు ని విచారించింది. సెప్టెంబర్ 20 న హాజరు కావాల్సి ఉండగా సెప్టెంబర్ 7 న నందు విచారణకు హాజరు అయ్యాడు. సెప్టెంబర్ 7 న ఈడి కార్యాలయానికి కెల్విన్, జీషాన్ వచ్చారు. కెల్విన్ , జీశాన్ ల ఇళ్లలో సోదాలు చేసి ఈడి కార్యాలయానికి అధికారులు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 8 న రానా ను 8 గంటల పాటు విచారించింది.
రానా, నందు విచారణ కు హాజరు అయ్యిన రోజుల్లో కెల్విన్ , జీశాన్ లను కలిపి ఈడి అధికారులు విచారించారు. సెప్టెంబర్ 9 న రవితేజ , తో పాటు డ్రైవర్ శ్రీనివాస్ ను 6 గంటల పాటు విచారించిన ఈడి... సెప్టెంబర్ 13 న నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను 9 గంటల పాటు విచారించింది. సెప్టెంబర్ 15 న ముమైత్ ఖాన్ ను 7 గంటల పాటు విచారించింది. సెప్టెంబర్ 17 న తనీష్ ను 7 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 22 న తరుణ్ ను 8 గంటల పాటు విచారించారు.