కొన్ని సినిమాలు విడుదలకు ముందే ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకుంటాయి. సినిమాలోని పాటలు, పోస్టర్లు, ట్రైలర్ లు మంచి క్రేజ్ వచ్చిందంటే చాలు ఆ సినిమా కోసం మూవీ లవర్స్ పడిగాపులు కాస్తారు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలా టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా లవ్ స్టోరీ...ఈ సినిమా కు ముందు నుండే ఎంతో హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాను అనౌన్స్ చేసినప్పుడే దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోయిన్ సాయిపల్లవి హీరోగా చైతూ అనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక సినిమా పోస్టర్ లతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు అదే సమయంలో శేఖర్ కమ్ముల సారంగదరియా అనే జానపదాన్ని రిలీజ్ చేశారు.
ఇక సారంగదరియా గురించి మాట్లాడుకోని వారుండరేమో అన్న విధంగా పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫిదా సినిమాలో వచ్చిండే పాటతో రికార్డులు క్రియేట్ చేసిన పాయి పల్లవి సారంగదరియా పాటతో తన రికార్డులను తానే మళ్లీ బీట్ చేసింది. ఇక ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ ముందు నుండి విడుదల చేస్తామంటూ చిత్ర ఊరిస్తూ వచ్చింది. కానీ కరోనా ఇతర కారణాల విడుదల వాయిదా పడగా ఎట్టకేలకు చిత్ర యూనిట్ సెప్టెంబర్ 24న విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలీవుడ్ హీరో అమీర్ ఖార్ మెగాస్టార్ చిరంజీవి హాజరవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా హైదరబాద్ లోని జీవీకే మాల్స్, ఏ ఎంబీ సినిమాస్, ప్రాసాద్ మల్టీ ప్లెక్స్ లో దాదాపుగా టికెట్లు బుక్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలోనూ లవ్ స్టోరీ సినిమా టికెట్లకు భారీ గిరాకీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అందమైన ప్రేమకథ చిత్రాన్ని అమిగో సినిమాస్ మరియు వెంకటేష్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.