విదేశాలకు బయలుదేరిన మహేష్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు  సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ క్రేజీ
ప్రాజెక్ట్ కు గీత గోవిందం పేమ్ పరుశురాం దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన చివరి దశ చిత్రీకరణ కోసం యూనిట్ సభ్యులు స్పెయిన్ వెళ్లబోతున్నారు. మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పటికే విదేశాల్లో చిత్రీకరణ చేయడం జరిగింది. మూవీ మొదటి షెడ్యూల్ విదేశాల్లో షూటింగ్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ , గోవా లో సినిమా షూటింగ్ ను నిర్వహించారు. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసిన సర్కారు వారి పాట సినిమా బృందం విదేశాలకు ప్రయాణం అవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

 యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం వచ్చే వారంలో సర్కారు వారి పాట చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళ్లితున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ రెండు నుండి మూడు వారాలపాటు కొనసాగుతుంది అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను మరియు పాటలను చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ సాధించేలా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుండి విడుదలైన కొన్ని ప్రచార చిత్రాలు ఇప్పటికే జనాల నుండి మంచి ఆదరణ తెచ్చుకోగా, సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 13 జనవరి 2022 లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చట్టబద్ధం అఫీషియల్ గా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: