తనకు ఆ ముగ్గురు అంటే ఎంతో ఇష్టమంటున్న రాశీఖన్నా..!
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో నటించిన జై లవకుశ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకుంది రాశీ. తమిళంలో సైతం ఆమె నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తన కేరీర్ మొదట్లో చాలా బొద్దుగా ఉన్న రాశీఖన్నా... ఈ మధ్య కాలంలో చాలా స్లిమ్గా తయారు అయింది. జీరో సైజుకు మారింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తుంది రాశీ. అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అభిమానులతో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది రాశీ. వరుస సినిమాలతో తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది రాశీఖన్నా.
క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. తెలుగులో ఇష్టమైన నటులు ఎవరని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఎన్టీఆర్, అల్లుఅర్జున్, మహేశ్బాబు అని సమాధానం చెప్పుకొచ్చింది. అదేవిధంగా హీరోయిన్ల విషయానికొస్తే అనుష్క, సమంతంటే చాలా ఇష్టం అని పేర్కొంది. ఢ్యాన్స్లో తాను స్లైల్స్టార్ అల్లు అర్జున్ అభిమానిని అని వెల్లడించింది. తెలుగులో నాగచైతన్యతో కలిసి థాంక్యూ, గోపిచంద్తో పక్కా కమర్షియల్ సినిమాల్లో నటించనుంది. తమిళంలో అరణ్మనై3, సర్దార్ చిత్రాలను రాశీ చేస్తోంది. వీటితో పాటు మరో మూడు సినిమాలలో కూడ నటిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి తెలుగులో ఆ ముగ్గురు హీరోలు అంటే ఇష్టం అని పేర్కొన్న విషయం వైరల్గా మారింది.