తన తరువాత సినిమా క్రిష్ ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడట...!

murali krishna
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విభిన్నమైన సందేశాత్మక సినిమాలతో ఎక్కువగా గుర్తింపు అందుకున్నటువంటి అతి కొద్దిమంది దర్శకుల్లో క్రిష్ ఒకరని అందరికి తెలుసు. ఈ దర్శకుడు కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా విజయం అందుకొని చాలా కాలం అవుతోందని తెలుస్తుంది.
కంచె గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల అనంతరం మళ్ళీ సరైన విజయాన్ని అందుకోలేదని తెలుస్తుంది. బాలకృష్ణతో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కించిన క్రిష్ ఊహించని స్థాయిలో భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడని సమాచారం. అయినప్పటికీ ఈ దర్శకుడు టాలీవుడ్లో చాలా మంది హీరోతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ హిస్టారికల్ కథను తెర పైకి తీసుకు వస్తున్న విషయం అందరికి తెలిసిందే . హరిహర వీరమల్లు పాన్ ఇండియా మార్కెట్కు తగ్గట్లుగానే రూపొందిస్తున్నారని సమాచారం. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవని తెలుస్తుంది. దర్శకుడు క్రిష్ ఇప్పటికే గౌతమీపుత్ర శాతకర్ణి తన సత్తా ఏంటో చూపించాడని సమాచారం.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అంతకు మించి అనేలా మరో చారిత్రాత్మక కథను తెర పైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్త వినిపిస్తుంది. అయితే హరివరం వీరమల్లు సినిమాను మొదలు పెట్టిన తర్వాత దర్శకుడు క్రిష్ ఆ సినిమాని పక్కన పెట్టే వేరే పనులు కూడా పూర్తి చేయాల్సి వస్తోందని తెలుస్తుంది. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తో కొండపొలం అనే సినిమాను తెరకెక్కించిన సంగతి అందరికి తెలిసిందే ఈ సినిమాను క్రిష్ చాలా వేగంగా పూర్తి చేశాడని సమాచారం. ఈ శుక్రవారం సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోసం సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఆ సినిమా తర్వాత హరిహర వీరమల్లు రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. అయితే కొంత సమయం మిగిలి ఉండడంతో ఈ దర్శకుడు బాలకృష్ణతో మరో ప్లాన్ వేసినట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ ఇటీవల ఆహా యాప్ కోసం ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్త వినిపిస్తుంది. అయితే ఆ టాక్ షోకి సంబంధించిన కాన్సెప్ట్ తో పాటు ప్రమోషనల్ యాడ్స్ అలాగే షోకు పూర్తిగా దర్శకత్వం చేయనున్నట్లు సమాచారం. బాలకృష్ణతో క్రిష్ మంచి అనుబంధం ఉన్న విషయం విషయం అందరికి తెలిసిందే. అలాగే భవిష్యత్తులో వీరి కలయికలో మరో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.ఇక ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి మంచి ఊపు మీద ఉన్నాడు.బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. మరో రెండు వారాల్లో ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.అలాగే గోపీచంద్ మలినేనితో కూడా బాలయ్య మరొక సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చిన కూడా అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కూడా మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తుంది . అలాగే దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసే పనిలో బిజీగా వున్నాడని వార్త వినిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: