నాలో నాకు నచ్చేది అదే : శృతిహాసన్
ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ సాధించింది. దీంతో మరోసారి ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తోంది శ్రుతిహాసన్. అంతేకాదు ప్రస్తుతం వరుస అవకాశాలు కూడా అందుకుంటూ బిజీ బిజీ హీరోయిన్గా మారిపోయింది శృతిహాసన్. ఇక ప్రభాస్ తో నటిస్తున్న ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
తన లో తనకి నచ్చేది తన నిజాయితీ అని చెబుతోంది శృతిహాసన్. నిజాయితీగా ఆలోచించడంతో పాటు ప్రతి రోజు తాను ఓ పాఠం నేర్చుకుంటాను అంటూ చెబుతోంది. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా ఎలాంటి కంగారు పడకుండా ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచిస్తాను అని చెబుతోంది. ఎదుటివారి నుంచి కాకుండా నా నుంచి నేను ఆత్మ విమర్శన చేసుకోవడం మొదలు పెడతానని ఇక ఆ తర్వాత ఇతరుల గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఇకపోతే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శృతిహాసన్ అటు అప్పుడప్పుడూ అభిమానులతో చిట్ చాట్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది విషయం తెలిసిందే.