ఆ విషయంలో అల్లుఅర్జున్ ని విమర్శిస్తున్న నెటిజెన్స్...!
రెండు పార్టులు గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం మొదటి పార్టు డిసెంబర్ 17న రిలీజ్ కాబోతుందని సమాచారం.. అయితే ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో అల్లుఅర్జున్ పై విపరీతంగా ట్రోలింగ్ పెరుగుతుందని తెలుస్తుంది.యంగ్ హీరోల సినిమాలకు సపోర్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు వెళ్తున్న అల్లుఅర్జున్ అక్కడ తగ్గేదేలే తగ్గేదేలే అంటూ పదే పదే పదాన్ని వాడుతున్నాడని అందరికి తెలుసు.
కాగా ఇదే విషయమై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ మరియు ట్రోల్స్ చేస్తున్నారని తెలుస్తుంది.యంగ్ హీరోల సినిమాలకు సపోర్ట్ చేస్తున్నారా లేక మీ సినిమాలకు ప్రమోషన్స్ చేసుకుంటున్నారా అంటూ మీమ్స్ కూడా చేస్తున్నారని సమాచారం.. ఇదిలా ఉండగా అయితే శుక్రవారం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు చిరంజీవి మరియు బాలకృష్ణ, వెంకటేష్ అలాగే ఎన్టీఆర్, రానా, శ్రీకాంత్, నరేష్, శివ బాలాజీ, అలీ ఇలా చాలా మంది టాలీవుడ్ స్టార్స్ వెళ్లారని తెలుస్తుంది.
అయితే శనివారం రాత్రి విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పుష్పక విమానం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అల్లుఅర్జున్ పాల్గొన్నారని సమాచారం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ నాకు బాగా తెలుసనీ మా ఇంటికి వచ్చిన భోజనం కూడా చేసే వారని చెప్పుకొచ్చారట . నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అని ఎప్పుడు ఫోన్ చేసిన బెంగుళూరు రండి సార్ అంటూ అడిగేవారని అన్నారు అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారని తెలుస్తుంది.
ఇక్కడివరకు బాగానే ఉందట అంత పరిచయం ఉన్న వ్యక్తి మరియు ఓ మంచి వ్యక్తి చనిపోతే కనీసం చూడటానికి కూడా మీకు వెళ్ళటానికి సమయం లేదా అంటూ అల్లుఅర్జున్ పై మండిపడుతున్నారట నెటిజన్స్. ఇంకా ఆయన పార్థివ దేహానికి ఖననం కూడా చేయలేదని అప్పుడే మీరు సినిమా ఫంక్షన్ కి వచ్చి నవ్వుతు మాట్లాడుతూ బాధపడుతున్నా అంటున్నారని మీరు బాధపడుతున్నట్లు మాత్రం అసలు అనిపించట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది . కాగా ఆదివారం ఉదయం పునీత్ అంత్యక్రియలు జరిగిన విషయం అందరికి తెలిసిందే.