నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?
సాయి పల్లవి, కృతి శెట్టి ఈ సినిమా లో కథానాయికలుగా నైటిస్తుండగా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా జంధ్యాల స్టైల్ లో ఎంతో ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇకపోతే నాని ఇటీవలే దసరా సినిమా ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
దసరా సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సినిమా ను అనౌన్స్ చేయగా నాని ఈ సినిమా లో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ తోనే సినిమా హిట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తుండగా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్లబోతుంది సినిమా. ఈ సినిమా లో కథానాయికగా హీరోయిన్ నిత్యామీనన్ ని అనుకుంటుండగా నాని ఫ్యాన్స్ ఆమెను వద్దని చెప్తున్నారు. ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ను ఎందుకు పెట్టుకోవడం అని సూచిస్తున్నారు. మరి వారి మాట నాని వింటాడా అనేది చూడాలి.