చిరంజీవి అలాంటివి చేయడంతో భయపడ్డాను అంటున్న.. పరుచూరి..!

Divya
చిరంజీవి కెరియర్ నే మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖైదీ చిత్రం అని చెప్పుకోవచ్చు. దీనిని డైరెక్టర్ కోదండ రామిరెడ్డి తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ 1983 లో విడుదలైంది. ఆప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది ఈ మూవీ. అయితే ఈ సినిమాకి రైటర్ గా పని చేసిన పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాలో నటించిన చిరంజీవి పై షాకింగ్ కామెంట్ చేశారు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

ఖైదీ సినిమాలో ముఖ్య పాత్రలు పరుచూరి బ్రదర్స్ నటించడం గమనార్హం. 1978 వ సంవత్సరంలో చలిచీమలు ద్వారా మేము రచయితగా మా కెరీర్ ని మొదలు పెట్టాము. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఖైదీ సినిమాకి మాకు అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ముందుగా 1983 లో కృష్ణ శోభన్ బాబు లతో కలిసి  ముందడుగు సినిమాని తెరకెక్కించాము. అదే మాకి ప్లస్ అని చెప్పుకొచ్చారు.

ఒక హీరోకి హీరోయిజం చూపించడానికి, ఒక నిర్మాత ఒక మంచి సినిమాను నిర్మించానని చెప్పుకోవడానికి, ఒక డైరెక్టర్ కోరుకునే సినిమాగా తీయడానికి, ఒక రచయితగా పేరు పొందడానికి కావలసిన సినిమాలలో ఖైదీ కూడా ఒకటి అని తెలియజేశారు పరుచూరి గోపాలకృష్ణ. చిరంజీవి తన 38 ఏళ్ల కెరీర్లో ఖైదీ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలియజేశాడు. ముఖ్యంగా ఈ సినిమా కథను వినకుండానే చిరంజీవి ఓకే చేశారని తెలియజేశాడు.

కేవలం ఈ కథనంతా టేప్ రికార్డుల ద్వారానే వినిపించాము. ఈ స్టోరీ చిరంజీవి మూవీ మొదలు పెట్టిన  తర్వాతే విన్నారని తెలియజేశారు. ఒక పేదవాడు, పెట్టుబడిదారు మధ్య జరిగే టువంటి యుద్ధమే ఈ సినిమా అని తెలియజేశారు. ఈ సినిమా మొత్తం చిరంజీవే బాధ్యత తీసుకున్నారని తెలియజేశారు. చిరంజీవి ఎన్నోసార్లు డూప్ లేకుండా చేశారని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. అలా చేయడం చూసి మేము ఒకసారి ఆశ్చర్యపోయానని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: