సినిమాలలో ప్రయోగాలు చేయడం అవసరం. ఎప్పుడూ మూస పద్దతి లో పోకడ లో సినిమాలే కాకుండా అప్పుడప్పుడు కొన్ని సినిమాలను చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆ విధంగా ఎంతో మంది హీరోలు దర్శకులు నిర్మాతలు తమ జోనర్ కాకపోయినా కొత్త జోనర్ లోకి వెళ్లి సినిమాలను చేసి కొన్ని సక్సెస్ లు అందుకున్నారు. అయితే ఇవే ప్రయోగాలను చేసి కొంత మంది ఫ్లాప్ లను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా సినిమాలలో ముఖ్యంగా కథానాయకుడు ప్రాధాన్యత ఎక్కువగా ఉండే సినిమాల్లో ఇలా సాడ్ ఎండింగ్ ఇవ్వడం ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది.
కథానాయకుడు చనిపోవడం లేదా హీరోయిన్ చనిపోవడం వంటివి క్లైమాక్స్ ట్విస్ట్ లు పెడుతూ సినిమా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాల కథ లో ఈ రకమైన ఎండింగ్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా చేయడం వల్ల సక్సెస్ సంగతి పక్కన పెడితే భారీ ఫ్లాప్ అందుకోవడం ఎక్కువ అవుతుంది. దాంతో కొంత మంది హీరోలు ఈ విధంగా సినిమాలు చేయడం రిస్క్ అని భావించి వాటి జోలికి వెళ్లడం లేదు.
ప్రభాస్ సాయి ధరమ్ తేజ్ అడవి శేషు వంటి హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేసి ఇప్పటికే చేతులు కాల్చుకున్నారు అనే చెప్పాలి. ప్రభాస్ తన చక్రం సినిమాలో చివర్లో స్యాడ్ ఎండింగ్ పెట్టి ప్రేక్షకులను కంటతడి పెట్టించిన కూడా కమర్షియల్ గా ఆ చిత్రం పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. అలాగే సాయి ధరం తేజ్ ఇటీవలే రిపబ్లిక్ సినిమాలో కూడా క్లైమాక్స్ లో ఎన్ని చూపించాడు. ఆ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. మంచి సినిమా అని కితాబులు అందుకున్న కూడా హీరో చనిపోవడం అనే దాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఇక అడవి శేష్ కూడా తన రాబోయే చిత్రంలో శాడ్ ఎండింగ్ చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా అలరించబోతోండో చూడాలి.