ఈ సినిమాతో ప్రభాస్ కెరియర్ మారిపోయిందా..?

Divya
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ వర్షం సినిమాతో తన కెరీర్ మారిపోయిందని చెప్పాలి.. అయితే సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ప్రభాస్ రెమ్యునరేషన్ విషయంలో అయితే వెనుకంజ లోనే ఉన్నాడు. వర్షం సినిమా తర్వాత కూడా ఆయన రెమ్యూనరేషన్ పెద్దగా పెంచలేదని చెప్పాలి. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్.. ఈ సినిమాతో తన కెరీర్ అమాంతం మారిపోతుంది అని ఎంతోమంది తమ ఊహాగానాలను వ్యక్తం చేశారు.


కేవలం ప్రభాస్ కెరియర్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో నటించిన అనుష్క, తమన్నా, దగ్గుపాటి రానా, నాజర్ , సత్యదేవ్ ఇలా ఎంతోమంది జాతకాలు మారిపోతాయని కూడా అనుకున్నారు. కానీ బాహుబలి సినిమా కేవలం దర్శకుడు రాజమౌళి కి ,హీరోగా ప్రభాస్ కి ఉపయోగపడటమే కాకుండా.. అమాంతం వారి సినీ కెరీర్ గ్రాఫ్ పెరిగిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అనుష్క సినీ ఇండస్ట్రీలో ఎక్కడ కనిపించడం లేదు.. ఇక దగ్గుబాటి రానా ఇటీవల భీమ్లా నాయక్ సినిమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక సత్యదేవ్, నాజర్ లు కూడా చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కే పరిమితమయ్యారు.

ఈ సినిమాతో మంచి ప్రయోజనం కలిగింది అంటే కేవలం ముగ్గురికే అని చెప్పాలి. శివగామి గా ఒక సంచలనం సృష్టించిన రమ్యకృష్ణ కు, ప్రభాస్ కు మంచి డిమాండ్ పెరిగింది.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ను పెంచేసి భారత సినీ ఇండస్ట్రీలో రూ. 100 కోట్లు తీసుకుంటున్న సినీ నటుడిగా చలామణి అవుతున్నారు. ఇక రమ్య కృష్ణ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ అయిన లైగర్ సినిమాలో నటిస్తోంది. ఇకపోతే బాహుబలి సినిమా తోనే ప్రభాస్ వంద కోట్లు పారితోషికం తీసుకునే రేంజ్ కు  ఎదిగాడు కాబట్టి ఆయన కెరియర్ అమాంతం పెరిగిపోయింది..ఇందుకు కారణం  మాత్రం బాహుబలి సినిమా అనే చెప్పాలి. ఇక కేవలం ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ హీరోలనే ఢీకొట్టే రేంజికి ఎదగడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: