టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించి ఇప్పుడు బాలీవుడ్ కి సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన ఈమె ఆ తర్వాత వరుస మంచి పెద్ద సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. దాదాపుగా అందరూ పెద్ద హీరో లతో కలిసి నటించిన ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో కొంత కష్టకాలం ఎదుర్కొంటుందని చెప్పవచ్చు.
రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన ఆమె హీరోయిన్ గా చేసి ఒకానొక సమయంలో ఆమె తన స్టార్ డమ్ ను చూపించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకు గడ్డుకాలమే నడుస్తుందని చెప్పాలి. ఆమె చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. ఆమె నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతుండడం తో ఒక్కసారిగా ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. దాంతో రకుల్ ప్రీత్ సింగ్ వల్ల నల్లగా కూడా సినిమా పరిశ్రమకు దూరం అయిపోయింది.
బాలీవుడ్ లో ఆమె చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి తనకు తప్పకుండా మంచి పేరు ను తీసుకు వస్తాయని ఆమె భావిస్తుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో ఆమె నటించిన తీరుకు ప్రేక్షక లోకం దాసోహం అయ్యింది. దాంతో ఆమెకు ఉన్న డిమాండ్ ను పసిగట్టిన దర్శక నిర్మాతలు ఆమెకు వరుస సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. మరి ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె తన అదృష్టాన్ని తిరగ రాసుకుంటుందా అనేది చూడాలి. కొత్త హీరోయిన్ల రాకతో ఈమెకు ఆదరణ కరువైంది తెలుగు సినిమాలలో. మరి నటనా పరంగా గ్లామర్ పరంగా ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఏ మాత్రం తగ్గని మంది తెలుగులో రాణిస్తుందా అనేది చూడాలి.