బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టం అంటున్న..ప్రగ్యా జైస్వాల్

Divya
మెగా హీరో వరుణ్ తేజ్ సరసన కంచె సినిమా ద్వారా తెలుగు ప్రజలకు బాగా దగ్గరైన ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ సినిమా ద్వారా మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకుంది. ఇకపోతే బాలయ్య బాబు , బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. అయితే ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొడుతుందా లేదా అనే సందేహాలు ప్రతి ఒక్కరికి సినిమా షూటింగ్ మొదలైన రోజు నుంచి ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే అందరి అనుమానాలకు తెరపడింది అని చెప్పవచ్చు.
ఇకపోతే ఈ సినిమాకి ముందు థియేటర్ల దగ్గర ఏ సినిమా కూడా పెద్దగా సందడి చేసింది లేదు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డులు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇకపోతే బాలయ్య బాబు కటౌట్ దగ్గర కొబ్బరికాయలు కొట్టడం..హారతులు పట్టడం వంటివి చేశారు అభిమానులు. ఈ సినిమాలో బోయపాటి యాక్షన్ తో పాటు ఆధ్యాత్మికత ను కూడా జోడించడం వల్ల ప్రేక్షకులకు కొత్తగా అనిపించి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే బాలయ్య బాబుకు ఈమధ్య హీరోయిన్ దొరకడం కష్టం అవుతుంది . అందుకే కొంతమంది కొత్త కథానాయికలను తీసుకొస్తున్నారు
ఇందులో భాగంగానే ప్రగ్యా జైస్వాల్  ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టారు. ఇక నిన్న రాత్రి వైజాగ్ లో జరిగిన గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ..కొన్ని విషయాలను వెల్లడించింది.. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అఖండ సినిమాకు అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదు. బాలయ్య బాబు తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇది నా అదృష్టం అంటూ ప్రగ్యా జైస్వాల్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: